అన్వేషించండి

Jagananna Vasathi Deevena Funds: నేడు ఆ తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత నగదు జమ

YS Jagan To Release Jagananna Vasathi Deevena Funds: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించి బహిరంగసభలో పాల్గొననున్నారు. అక్కడే జగనన్న వసతి దీవెన రెండో విడత నగదు విడుదల చేస్తారు.

Jagananna Vasathi Deevena Funds: సంక్షేమ పాలనకే మొగ్గుచూపిన ఏపీ ప్రభుత్వం నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని విడుదల చేయనుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని.. రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కగానే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ రూ.1,024 కోట్లు జమ చేస్తారు.  ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే విద్యార్థుల భోజన, వసతి ఖర్చులను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. 

తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
ప్రతి ఏడాది జగనన్న వసతి దీవెన పథకం కింద రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.

తండ్రి వైఎస్సార్ బాటలో సీఎం జగన్..
తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆనాడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ లాంటి పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులని డాక్టర్లు, ఇంజినీర్లు చేయగా.. నేడు వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి విద్యార్థులకు భోజనం, వసతి ఖర్చులను సైతం అందిస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌ –డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.709 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. నేడు మరో రూ.1,024 కోట్లు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి.

Also Read: Rama Navami 2022: శ్రీరామనవమి నాడు విచిత్రమైన పరిస్థితి - మంత్రులు లేని సీఎంగా వైఎస్ జగన్

Also Read: Lucky Five : ఆ ఐదుగురు ఎవరు ? జగన్‌ కేబినెట్‌లో కొనసాగే వారెవరు ? 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget