అన్వేషించండి

Jagananna Vasathi Deevena Funds: నేడు ఆ తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత నగదు జమ

YS Jagan To Release Jagananna Vasathi Deevena Funds: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించి బహిరంగసభలో పాల్గొననున్నారు. అక్కడే జగనన్న వసతి దీవెన రెండో విడత నగదు విడుదల చేస్తారు.

Jagananna Vasathi Deevena Funds: సంక్షేమ పాలనకే మొగ్గుచూపిన ఏపీ ప్రభుత్వం నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని విడుదల చేయనుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని.. రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కగానే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ రూ.1,024 కోట్లు జమ చేస్తారు.  ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే విద్యార్థుల భోజన, వసతి ఖర్చులను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. 

తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
ప్రతి ఏడాది జగనన్న వసతి దీవెన పథకం కింద రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.

తండ్రి వైఎస్సార్ బాటలో సీఎం జగన్..
తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆనాడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ లాంటి పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులని డాక్టర్లు, ఇంజినీర్లు చేయగా.. నేడు వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి విద్యార్థులకు భోజనం, వసతి ఖర్చులను సైతం అందిస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌ –డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.709 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. నేడు మరో రూ.1,024 కోట్లు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి.

Also Read: Rama Navami 2022: శ్రీరామనవమి నాడు విచిత్రమైన పరిస్థితి - మంత్రులు లేని సీఎంగా వైఎస్ జగన్

Also Read: Lucky Five : ఆ ఐదుగురు ఎవరు ? జగన్‌ కేబినెట్‌లో కొనసాగే వారెవరు ? 

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget