అన్వేషించండి

CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

World Economic Forum: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారత్ మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌లో స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు.

CM Chandrababu Comments In WEF Press Meet: ప్రధాని మోదీ టెక్నాలజీకి బలమైన పునాది వేశారని.. తాము ఇక్కడి నుంచి సాంకేతికతను తీసుకెళ్లడం లేదని.. ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఇతర కేంద్ర మంత్రులు, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల మంత్రులు నిర్వహించిన విలేకరుల సమావవేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు. దావోస్‌లో (Davos) జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో (World Economic Forum) భారత్ తొలిసారి ఒకే వేదికపైకి వచ్చిందని.. ఒకే గొంతుకగా పాల్గొందని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకున్నట్లు చెప్పారు. విభిన్న రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా ఒకటిగా కలిసి పని చేస్తామని తెలిపారు.

'ఇండియా ఫస్ట్' అనేదే మా నినాదం'

తామంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారమైనా.. 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనే నినాదంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 'ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే. బ్లూంబర్గ్ అనలిటిక్స్ ప్రకారం 2028 నాటికి జీడీపీ వృద్ధిలో భారత్ అగ్రగామిగా నిలవనుంది. దావోస్‌లో తొలిసారిగా నేను టీమిండియాను చూస్తున్నా. అందరం కలిసి ఒకే చోట ఒకే గళం వినిపిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

నేనే సీనియర్..

భారత్ నుంచి దావోస్‌కు హాజరైన వారిలో తానే సీనియర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 1997లో తొలిసారి ఇక్కడకు వచ్చానని.. అప్పట్లో ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, ఒకటి, రెండు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మాత్రమే వచ్చే వారని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా పోటీ పెరిగిందని పేర్కొన్నారు. 'ఈసారి అద్భుతమైన ఆహ్వానం లభించింది. భారత బృందానికి అత్యుత్తమ గుర్తింపు దక్కింది. ప్రతిచోటా భారతీయ ప్రాతినిధ్యం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్‌ను అందరూ నమ్ముతున్నారు. పర్యావరణ సుస్థిరతలో భాగంగా భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ 165 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సులో భారత్‌ను బాగా ప్రమోట్ చేస్తున్నాం.' అని సీఎం తెలిపారు.

మహారాష్ట్ర ఆర్థికంగా చాలా బలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తలసరి ఆదాయంతో పాటు ఇతర ఎకో సిస్టమ్‌లో తెలంగాణ ముందుందని.. ఏపీ వాటి స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలని అన్నారు. ఆ దిశగా పని చేస్తున్నామని.. సాధిస్తామన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

చంద్రబాబు టెక్నాలజీ మ్యాన్

పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఒక ఐకాన్ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసించారు. ఆయన్ను టెక్నాలజీ మ్యాన్‌గా అభివర్ణించిన ఆయన.. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు విజన్ చాలా గొప్పదని కొనియాడారు.

Also Read: CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం  చంద్రబాబు, లోకేశ్ భేటీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Dhurandhar Records: 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Embed widget