అన్వేషించండి

AP Cabinet: కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP cabinet: ఏపీలో కుల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రతిపాదన, ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపింది. కర్నూలులో నేషనల్ లా వర్శిటీకి మరో 100 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్

జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. 

ఇవీ నిర్ణయాలు

అలాగే, పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ పై రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం పడనుందని, అయితే, 50 వేల మంది కార్మికులు దీనిపై ఆధార పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. అలాగే, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్య శ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ - 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపైనా కేబినెట్ లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్ కు పురపాలక శాఖ ప్రతిపాదనలు పంపింది.

ఈ నిర్ణయాలకూ ఆమోదం

  • నవంబరులో సంక్షేమ క్యాలెండర్ అమలు, రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం
  • పౌర సరఫరాల కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు అనుమతి. ధాన్యం సేకరణ కోసం రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం
  • అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన. 467 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఆమోదం
  • తూ.గో, సత్యసాయి జిల్లాల్లో రవాణా శాఖ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
  • ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా నిర్ణయం, ప్రభుత్వ హైస్కూళ్లలో సాంకేతిక నైపుణ్యం కోసం ఇంజినీరింగ్ కళాశాలలతో మ్యాపింగ్.
  • విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సంస్థకు చిత్తూరు జిల్లా భూకేటాయింపు.
  • గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఎన్టీపీసీకి అనుమతిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

21 నుంచి కులగణన

రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి కులగణన ప్రారంభం అవుతుందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన కృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కులగణన వల్ల వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితి తెలుసుకోవచ్చని, దీని వల్ల ఈ వర్గాల అభ్యున్నతికి ఏం చేయాలో తెలుస్తుందని అన్నారు. 92 ఏళ్ల తర్వాత కులాల వారీగా లెక్కలు తీస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: రుషికొండలో నిర్మాణాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాజకీయ కారణాలతో వేసినట్లుందని ఆగ్రహం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget