అన్వేషించండి

Breaking News Live: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా ... 27 మందికి తీవ్రగాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on November 28 Wednesday Breaking News Live: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా ... 27 మందికి తీవ్రగాయాలు
ప్రతీకాత్మక చిత్రం

Background

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. రెండు రోజుల క్రితం ఊపిరితిత్తులతో నిమ్ము చేరడంతో ఆస్పత్రిలో చేర్చినట్లుగా కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన్ని ఐసీయూలో ఉంచి వైద్య బృందం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై సిరివెన్నెల తనయుడు యోగి స్పందించారు. ‘‘నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

నేడు కరోనా కొత్త వేరియంట్‌పై రివ్యూ
కరోనా కొత్త రకం వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళన వేళ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేసింది. దీంతో మంత్రి హరీశ్‌ రావు ఆదివారం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితి, కొత్త వేరియెంట్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్‌ వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించనున్నారు.

బైక్‌ను తగలబెట్టుకున్న వ్యక్తి
ట్రాఫిక్‌ పోలీసులు తరచూ చలాన్లు వేస్తున్నారని ఆగ్రహంతో ఓ వ్యక్తి ఏకంగా‌ తన బైక్‌ను తగలబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్‌ మక్బుల్‌ అనే వ్యక్తి క్షణికావేశంతో ఈ పని చేశాడు. కిసాన్‌ చౌక్‌ మీదుగా బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో కిసాన్‌ చౌక్‌ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్‌ పోలీసులు అతడిని నిలిపి పెండింగ్‌ చలానాలు చెల్లించాలని సూచించారు. దీంతో అతను ఆవేశంతో తన బైక్‌ లోని పెట్రోల్‌ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు.

బంగారం ధరలు..
బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,050 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,150 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర కాస్త పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,050 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,900 గా ఉంది.

22:23 PM (IST)  •  28 Nov 2021

చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా ... 27 మందికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దాదంవారి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్ప బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి.  ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బాధితులను హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని బెంగుళూరుకి తరలించారు. సింగమానుబురుజు నుంచి కాండ్లమడుగుకు పెళ్లికి వెళ్తోన్న గోల్డన్‌వ్యాలీ కాలేజీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై  ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. 

20:19 PM (IST)  •  28 Nov 2021

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగింపు

ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడింగించింది. సీఎస్‌గా సమీర్‌ శర్మకు పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30తో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీకాలం ముగిస్తుంది. దీంతో 2022 మే 31 వరకు సీఎస్‌గా సమీర్‌ శర్మ బాధ్యతలు నిర్వహించనున్నారు. 6 నెలల పాటు సమీర్ శర్మ పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ యూనియన్‌ సెక్రటరీ ఉత్తర్వులను జారీచేశారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Dhurandhar Records: 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Embed widget