Breaking News Live: గన్నవరం విమానాశ్రయానికి మెగాస్టార్ చిరంజీవి.. కాసేపట్లో సీఎంతో లంచ్ మీటింగ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమ్రోగుతోంది. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ స్వామి, వెల్లంపల్లె శ్రీనివాస్, గౌతం రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, అప్పల రాజు, ఆదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణలు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వేకువ జామున వైకుంఠ ద్వారం గుండా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి టీఎస్. దినేష్ కుమార్, కర్ణాటక సీజే రూతూ రాజ్ అవస్ధీ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వైసీపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, సినీ డైరెక్టర్లు మారుతీ, తిరుమల కిషోర్, లక్ష్మీ పార్వతీ, ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ ఎంపీ మార్గానీ భరత్, గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ మంత్రులు కూడా..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున రెండు గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కావడంతో తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీజేపీ నేత డీకే అరుణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నేత లక్ష్మారెడ్డి, సునీత లక్ష్మీ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మల్లారెడ్డిలు వేర్వేరుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి
* గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
* తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి బయల్దేరిన చిరు
* మరి కొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో లంచ్ మీటింగ్
* సీఎం ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ పెద్దగా వచ్చాను: చిరంజీవి
శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం బారులు తీరిన జనం
కలియుగ దైవం, సకల చరాచర సృష్టికర్త శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం భక్తులు అన్ని ఆలయాల ముందు బారులు తీరారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతోనూ , విశేష పుష్పాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టును దేశం నలుమూలల నుంచి తెప్పించిన విశేష పుష్పాలతో అలంకరించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వార దర్శనం కల్పిస్తున్నారు.





















