By: ABP Desam | Updated at : 20 Nov 2021 03:58 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి పేర్ని నాని(ఫైల్ ఫొటో)
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై నందమూరి ఫ్యామిలీ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి అని చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని నమ్ముతున్నారన్నారు. అందరి ఇళ్లల్లో మహిళలు ఉన్నారని, తాము అలా ఎందుకు తిడామన్నారు. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే మధ్యలో అనవసర చంద్రబాబు రాద్ధాంతం చేశారని ఆరోపించారు. చంద్రబాబు కావాలనే మెలో డ్రామా ఆడారని విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబు మెలోడీ డ్రామా
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాలను పక్కకు పెట్టి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు ఏమన్నారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. అనని మాటలను, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనే చంద్రబాబు చూస్తున్నారన్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజంగానే అవి నమ్మారన్నారు. నందమూరి కుంటుంబంలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదే జరిగనట్లు నమ్మించడానికి చంద్రబాబు నేర్పరితనం అన్నారు. అసెంబ్లీలో జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ టీడీపీ నేతలే మాట్లాడారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
చంద్రబాబు చేతిలో మోసపోవద్దు
వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉందన్న మంత్రి పేర్ని నాని.. ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైకు కట్ చేసినప్పుడు క్షణాల్లోనే సెల్ ఫోన్లో వీడియో ఎలా తీశారన్నారు. ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారమని విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నానన్నారు. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే అని మంత్రి పేర్ని నాని అన్నారు.
Also Read: పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !
Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా
CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్
Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
/body>