అన్వేషించండి

AP Budget Session 2024: ఫిబ్రవరి 5 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు-6న బడ్జెట్‌

AP Assembly News: ఏపీ బడ్జెట్‌ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానుండగా... 6వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది జగన్‌ సర్కార్‌.

Andhra Pradesh Assemby Budeget Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSRCP) ప్రభుత్వం. ఫిబ్రవరి 5  నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనుండగా... 6వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టనుంది జగన్‌ సర్కార్‌. ఈ బడ్జెట్‌ సమావేశాలు మూడు నుంచి ఐదు రోజుల పాటు  జరుగుతాయని సమాచారం. 

ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు.  దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం  జరుగుతుంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని  కేటాయింపులు చేయనుంది. 2023-24తో పోలిస్తే మొత్తం వ్యయం 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై త్వరలో తుది  నిర్ణయం తీసుకోనున్నారు. 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలోని 2014-19తో పోలుస్తే... ఈ ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని  హైలైట్ చేసే అవకాశం ఉంది. రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న రుణాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని... బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు  సీనియర్‌ అధికారులు చెప్తున్నారు. సంక్షేమ పథకాల వ్యయం, ఉపాధి కల్పనకు సంబంధించిన కీలక డేటాను ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపినట్లు తెలుస్తోంది. 

గత బడ్జెట్‌ వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను... 2లక్షల 79వేల 279 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది, ఇందులో సింహభాగం నవరత్నాల కింద అమలవుతున్న ప్రధాన  సంక్షేమ పథకాలకే కేటాయించింది. రెవెన్యూ వ్యయం 2లక్షల 28వేల 540 కోట్లు కాగా.... మూలధన వ్యయం 31వేల 61 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,316కోట్లు  ఉండగా... ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా ఉంది. ఆర్థిక లోటు GSDPలో 3.77 శాతం కాగా... రెవెన్యూ లోటు GSDPలో 1.54 శాతంగా ఉంటుంది. ఇక... 2022-23లో బడ్జెట్  వ్యయం రూ.2.56 లక్షల కోట్లు కాగా... 2021–22లో బడ్జెట్‌ వ్యయం రూ.2.29 లక్షల కోట్లు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget