అన్వేషించండి

Somu Veerraju : ఏపీలో వాళ్లతోనే పొత్తు, సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju : పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 కోట్ల ప్రజలతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

Somu Veerraju : ఏపీలో పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తాయని అటు ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న తరుణంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు...అధికారం కోసం హత్యా రాజకీయాలను చేస్తున్న రాక్షస ప్రభుత్వం ఏపీలో ఉందని తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనేదే బీజేపీ లక్ష్యమన్నారు. ఏపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సోము వీర్రాజు ప్రకటించారు. గతంలో జగన్‌ పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు ఎమర్జెన్సీని తలపించేలా జీవో ఎందుకని ప్రశ్నించారు. 

పొత్తులపై స్పందిస్తూ 

జీవో నెం. 1కి వ్యతిరేకంగా చలో తిరుపతికి పిలుపు ఇస్తామని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ  ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటిని అవినీతిమయం చేస్తోందని ఆరోపించారు. కుటుంబ, అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనే బీజేపీ లక్ష్యం అని తెలిపారు. సంక్షేమం పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలుచేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఒక్క బీజీపీకే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పొత్తులపై సోము వీర్రాజు స్పందిస్తూ... ఏపీలోని 3 కోట్ల ప్రజలతోనే బీజేపీకి పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 

పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ పడేనాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. పార్టీ ప్రచార రథం వారాహి వెహికల్‌కు ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన... కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ అంటోందన్న ప్రచారంపై కూడా ఇలానే స్పందించారు పవన్.  తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్‌ కల్యాణ్‌. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటును స్వాగతించిన పవన్ కల్యాణ్... మార్పు ఆహ్వానించదగిందే అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరమైన నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే తప్ప దావోస్‌లాంటి పర్యటనలు ప్రయోజనాలు ఇవ్వబోమన్నారు పవన్. గతంలో ఏపీ ప్రభుత్వ నేతలు వెళ్లిన తర్వాత.. ఆ ఊపును కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget