అన్వేషించండి

Amaravati Mahapadayatra: అమరావతి రాజధానికే కేంద్రం కట్టుబడి ఉంది... బీజేపీ కార్యాలయం అక్కడే కడుతున్నాం... మహాపాదయాత్రలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు

అమరావతి రాజధానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహా పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. 21వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో బీజేపీ అగ్రనేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్‌ పలువురు రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గోన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై స్థానిక యువత పూలవర్షం కురిపించారు.  పరిసర గ్రామాల నుంచి ప్రజలు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలివచ్చి రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 

Also Read: వరద సహాయక చర్యల్లో పాల్గోండి... ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు.. బాధితులకు ఉచితంగా నిత్యవసరాలు

రైతులపై లాఠీఛార్జ్ దారుణం 

నెల్లూరు జిల్లా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతులు సభ ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో అమరావతిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఈ సభలో మాట్లాడుతూ రాజధానిపై ముందు నుంచి బీజేపీ ఒకే విధానానికి కట్టుబడి ఉందన్నారు. రైతుల మహా పాదయాత్రలో లాఠీ ఛార్జీలు చూసి చలించిపోయామన్నారు. అమరావతి రాజధానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు

ప్రజలే బుద్ధి చెబుతారు: కన్నా లక్ష్మీనారాయణ

అనంతపురం-అమరావతి రోడ్డు, ఎయిమ్స్‌ పనులు జరుగుతున్నాయని పురందేశ్వరి వివరించారు. రైతులను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అని బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 

Also Read: ఏపీ వరద బాధితులకు అండగా ఉండండి... సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ ట్వీట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget