అన్వేషించండి

Vijaya Sai Reddy On TDP: కుటుంబాల జోలికి వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తే రెండింతలు స్పందిస్తాం- టీడీపీకి విజయసాయిరెడ్డి వార్నింగ్

టిడిపి నేతలు తమ కుటుంబం, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలన్నీ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేష్ అని అన్నారు.

అంచనాలకు మించి వైసీపీ ప్లీనరీ విజయవంతమవుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీపై కూడా ఘాటైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు మెయిన్ చిప్‌ దెబ్బ తిందని కామెంట్ చేశారు. 

తొలిరోజు వైసీపీ ప్లీనరీకి 70 వేల మంది వస్తారని అంచనా వేస్తే... లక్షా అరవై వేల మంది హాజరయ్యారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. వచ్చిన వారంతా కార్యకర్తలేనని... ఎక్కడా సామాన్య జనాన్ని తరలించలేదని వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్నా ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. జనాలను సభలకు తరలించే అవసరం తమకు లేదని... వచ్చిన వారంతా అభిమానంతో వచ్చారే తప్ప ఎవరి బలవంతంతో ఇక్కడకి రాలేదన్నారు. 

ప్లీనరీ ప్రారంభానికి ముందు, అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగా ఉండడం సహజమన్నారు విజయసాయిరెడ్డి. టిడిపి నేతలు వాటిని చూపించి తప్పుడు ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఉన్న మెయిన్ చిప్ దెబ్బతిందని కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్లీనరీకి ఎంతమంది వచ్చారో తాను ఉపయోగిస్తున్న రెండో చిప్ ద్వారా తెలుసుకోవాలని విజయసాయిరెడ్డు సూచించారు. 

టిడిపి నేతలు తమ పార్టీ నాయకుల కుటుంబం, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలన్నీ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేష్ అని అన్నారు. తమ నాయకులపై అసభ్య పదజాలాన్ని టీడీపీ ఉపయోగిస్తున్నందునే తాము కౌంటర్ ఇస్తున్నామని... తమ పార్టీ నేతలు ఎక్కడా గీత దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాలనేవి రాజకీయాలుగానే చేయాలి కానీ... వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తండ్రి వెన్నుపోటు, లోకేష్ చేసిన కార్యకలాపాలు గురించి తాము కూడా స్పందించవచ్చని కానీ వాటి జోలికి పోవడం లేదన్నారు సాయిరెడ్డి.

అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి విజయమ్మ ఎందుకు తప్పుకుంటున్నారో సవివరంగా చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. షర్మిలకు తోడుగా ఉండడం కోసం విజయ వెళ్తున్నారన్నారు. దీనిపై రాద్దాంతం సరికాదన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజు రాజకీయాల్లో లేరని... పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని వివరించారు. కుటుంబ వ్యవహారాలకే పరిమితమయ్యారని తెలిపారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు నచ్చదన్నారు విజయసాయిరెడ్డి. ఈ కులాలంటే చంద్రబాబుకు  ఈర్ష,  ద్వేషం అని అన్నారు. ఎంతసేపు తన సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Embed widget