అన్వేషించండి

సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం-డీజీపీ కార్యాలయం వివరణ

సీఎం జగన్ నివాసం ముందే న్యాయం కోసం మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఊహించని పరిణామంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే స్పందించి సిబ్బంది బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. 

అమలాపురం గొల్లగూడెంకు వాసి ఆరుద్ర... ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. తన చేతిని తానే గాయపర్చకున్నారు. తీవ్రంగా రక్తం కారటంతో అక్కడే పడిపోయారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతో ఇల్లు అమ్ముకుంటే కానిస్టేబుల్ వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. సీఎంకు ఆవేదన చెప్పేందుకు ట్రై చేస్తుంటే ఎవరూ వెళ్లనీయడం లేదని అన్నారు. 
స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరుద్ర. కానిస్టేబుల్ కన్నయ్య గతంలో ఓ మంత్రి వద్ద గన్ మెన్‌గా పని చేశారు. విషయం తెలియటంతో కానిస్టేబుల్‌ కన్నయ్యను మూడు నెలల క్రితమే మంత్రి పంపేశారు.

లోకేష్ కామెంట్స్ 

సీఎం జగన్ నివాసం ముందే న్యాయం కోసం మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనపడవుని ఎద్దేవా చేశారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవా అని నిలదీశారు. బాధితురాలికి తక్షణమే సాయం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీ పోలీస్ శాఖ వివరణ...

ఈ ఘటన సంచలనంగా మారటంతో ఏపీ పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర ఈ రోజు (02-11-2022) తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో చేయి కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారని తెలిపారు. తన ఇల్లు అమ్మకం విషయంలో అన్యాయం జరిగినట్లు చేసిన ఆరోపణలపై సంక్షిప్త  వివరణ ఇస్తూ డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 12న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాకినాడ రాయుడుపాలెంలో నివాసముంటున్న, రాజులపూడి ఆరుద్ర మహిళ అన్నవరం గ్రామములో రాజాల చిట్టిబాబు, ముత్యాలరావు,  మెరపల శివ, మెరపల కన్నయ్యపై కొన్ని ఆరోపణలు చేశారు. 

ఆరుద్ర ఫిర్యాదు మేరకు అన్నవరం పి.ఎస్‌.లో సెప్టెంబర్‌ 13న కేసు నమోదైనట్టు డీజీపీ కార్యాలయం చెప్పింది. ఆరుద్ర కుమార్తె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆసుపత్రి ఖర్చుల కోసం తన ఇంటిని అమ్మాలని ప్రతిపాదన చేశారు. ఆగస్టు 29న కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆరుద్ర మీడియాతో మాట్లాడుతూ మెరపల చిన్నమ్మలు కుమారుడిపై ఆరోపణలు చేశారు. 40 లక్షలు విలువ చేసే ఇంటిని 10 లక్షలకు అమ్మాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. 

ఈ విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోవాలని ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, పరస్పరం చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు పోలీసులు. ఆరుద్ర ఇంటిని విక్రయించడానికి పోలీసులు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈలోపు మెరపల చిన్నమ్ములు కూడా ఫిర్యాదు చేయడంతో అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. 

చిన్నముల ఫిర్యాదులో A-1 రాజులపూడి ఆరుద్ర, A-2 రాజులపూడి భువనేశ్వర్, A-3 భీమన్నగా పేర్కొన్నారు. రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఆరుద్ర పెట్టిన కేసు కొట్టేయాలని మెరపల శివ అన్నదమ్ములు హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో అన్ని చర్యలను 8 వారాలపాటు నిలిపి వేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

కన్నయ్య మంత్రి వద్ద నుంచి గన్ మెన్‌ను విధుల నుంచి తప్పించి జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు పంపామని డీజీపీ కార్యాలయం వివరించింది. శివను ఇంటలిజెన్స్ విభాగం నుంచి వెనుక్కి పంపినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. పోలీసు శాఖా పరంగా తీసుకోవలిసిన చర్యలన్నీ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఈ రెండు కేసులను అన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget