అన్వేషించండి

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు వస్తారా? జగన్‌కు సొము వీర్రాజు సవాల్

పోటీ ఉద్యమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, విద్వేషాలు రెచ్చ గొట్టడమే జగన్ విధానంగా ఉంద‌న్నారు సోమువీర్రాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా అని ప్ర‌శ్నించారు.

ఏపీ స‌ర్కారుపై బీజేపి నేత సొము వీర్రాజు తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. అమ‌రావ‌తి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్యాసంస్థలకు రహదారి నిర్మాణం కూడా చేయకపోవడంపై ఆయ‌న‌ మండిప‌డ్డారు. రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్దితుల‌ను ప్ర‌త్యక్ష్యంగా ప‌రిశీలించారు. జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాను ఎండ‌గ‌ట్టారు. ఎయిమ్స్‌ ఆసుపత్రి, అమృత్ విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీని ప‌రిశీలించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వెళ్ళే మార్గాల‌్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అమరావతిలో అభివృద్ధి ఆపేసి... ఎడారిగా మార్చారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు సోము వీర్రాజు. జగన్ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల‌్లో అమృత, విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ యూనివర్శిటీలలో అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుతున్నారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ఏపి ప్రభుత్వంపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఏపీ గురించి ఏమనుకుంటారో కూడా ఆలోచన చేయడం లేదని, ఈ తోలు మందం‌ ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోదని అసహ‌నం వ్య‌క్తం చేశారు.

పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్‌ను డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయాలని, యూనివర్శిటీ వాళ్లపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తన దృష్టికి వచ్చిందని వీర్రాజు అన్నారు. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపి‌వేయాలన్నారు. యూనివర్శిటీల‌కు వచ్చే ఒక్క రోడ్ కూడా బాలేదని, రెండు కోట్లు వ్యయం అయ్యే రోడ్ల పనులు పూర్తి చేయాల‌న్నారు. అన్నీ తెలిసినా జగన్ మొద్దు నిద్ర పోతున్నారని తెలిపారు. ఇక్కడే రాజధాని అని అధికారంలోకి వచ్చి మాట తప్పి, మడమ‌ తిప్పార‌ని, పరిపాలన వికేంద్రీకరణ అంటే అసలు జగన్‌కి అర్థం తెలుసా అని వీర్రాజు ప్ర‌శ్నించారు.

ఉత్త‌రాంధ్రకు కేంద్రం నిధులు....

విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చిందని, విజయనగరం నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు నాలుగు రోడ్లును కేంద్రం విస్తరిస్తుంద‌ని తెలిపారు. నాలుగు లైన్లను ఆరు లైన్ల రహదారిగా కేంద్రం అభివృద్ధి చేసింద‌ని, జగన్ విశాఖకు చేసిందేమీ లేదని... ఉంటే చెప్పాలని స‌వాల్ విసిరారు. మూడేళ్లల్లో ఏమి చేశారో చెప్పాలని బిజేపి సవాల్ చేస్తుందన్నారు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్ర చేస్తారా అని ప్ర‌శ్నించారు. బిజేపి రైతుల ఉద్యమానికి అండగా ఉంటుందని, టిడిపి, వైసిపి ప్రభుత్వాల వల్లే నేడు వాళ్లు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.

జగన్ 11కి.మి రోడ్డు కూడా వేయలేక పోయార‌ని, మోదీ ఐకాన్ బ్రిడ్జి వేస్తున్నార‌ని వివ‌రించారు సోమువీర్రాజు. కోడూరు, మేదరమెట్ల రోడ్‌కు టెండర్లు పిలిచార‌ని, ఏపిలో అనేక వంతెనలు, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. ఫొటోలకు ఫోజులిచ్చే జగన్‌కు.. రోడ్లు వేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో మూడు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ కేంద్రం కట్టిందని, జగన్‌కు దమ్ముంటే.. ముందు ఈ యూనివర్శిటీల వైపు వెళ్లే రోడ్లు వేయాలన్నారు.

పోటీ ఉద్యమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అభివృద్ధి పట్టదు... విద్వేషాలు రెచ్చ గొట్టడమే జగన్ విధానంగా ఉంద‌న్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా అని ప్ర‌శ్నించారు. ప్రజలను పక్కదారి పట్టించే ఉద్యమాలను జగన్ మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన పొరెల్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Embed widget