అన్వేషించండి

AP BJP: అప్పుడు ఎన్టీఆర్, మొన్న జగన్ - ఇప్పడు వై నాట్ బీజేపి నినాదంతో కాషాయం నేతలు

అప్పుడు ఎన్టీఆర్...మెన్న జగన్...ఇప్పడు వై నాట్ బీజేపి..కాషాయం నేతల ఆశలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు కొదవ ఉండదు.. నందమూరి తారకరామారావు అధికారంలోకి రావడం మొదలు, మొన్నటికి మెన్న వైఎస్ జగన్ అధికారాన్ని దక్కించుకున్నారు. అలాంటప్పుడు నెక్ట్స్ వై నాట్ బీజేపి అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులో...
బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని గుంటూరులో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు  అధ్యక్షతన జరిగే సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ సహ ఇంచార్జ్ సునీల్ దియోధర్ తదితర జాతీయ, రాష్ట్ర పార్టీ ముఖ్యులు హజరయ్యారు. ఈ సమావేశానికి బీజేపీకి చెందిన బూత్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు.
వై నాట్ భారతీయ జనతా పార్టీ...
ఈ సమావేశంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పై చేయాల్సిన పోరాటాలకు సంబందించిన కార్యచరణను నేతలు వివరించారు. అధికార పార్టీ అరాచకాల పై చార్ట్ షీట్ ను దాఖలు చేసే క్రమంలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపున బీజేపీ నేతలు పలువురు ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని, ఆనాడు నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి, అధికారంలోకి రావటం, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి పార్టి పెట్టిన తొమ్మిదేళ్ళ తరవాత ఆ పార్టి నేతలు సైతం ఊహించని విధంగా 151 సీట్లు దక్కించుకోవటం, వంటి సందర్బాలను ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులను చూసినప్పడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదనుకోలేమని, సో వై నాట్ భారతీయ జనతా పార్టీ అని నేతలు ప్రశ్నించారు. అదే స్పూర్తితో ముందుకు వెళ్ళాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
వైసీపీని దోషిగా నిలబెట్టేందుకే ఛార్జ్ షీట్...
రాష్ట్ర ప్రభుత్వంపై సోమువీర్రాజు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు చార్జి షీట్ వేయబోతున్నామన్నారు. వైసీపీ అవినీతి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టి సమర శంఖం పూరిస్తోందన్నారు. ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని, మే5 నుంచి 13 వరకూ చార్జ్ షీట్ కు అవసరమైన అంశాల సేకరణ కార్యక్రమాలను తలపెట్టాలని క్యాడర్ కు సూచించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ వంటి దమ్మున్న నాయకుడికి ఇక్కడ ఎవరితో నో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల కోసం రూ5 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వానికి 40 వేల కోట్లు గృహ నిర్మాణం కోసం ఇచ్చామని అన్నారు. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగటం లేదని, సర్పంచులకు రూ8 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సర్పంచులు గ్రామాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని మోదీ ఆలోచన అని, అందుకు అనుగుణంగానే ఉపాధి హామీ కోసం రూ75 వేల కోట్లు ఏపీకి ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిదులు ఇచ్చిందని, అమరావతి లోనే రాజధాని ఉంటుంది పార్లమెంటులో చెప్పామన్నారు. రాజధాని కోసమే ఎయిమ్స్ ఇక్కడ కట్టించి, అమరావతికి నిధులు ఇచ్చినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించని కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. హైవేలు, పై వంతెనలు అనంతపురం ఎక్స్ ప్రెస్ వే  అమరావతి కోసం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ దేశానికే కాదు రాష్ట్రానికి కూడా ఆయనే నాయకుడని, బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే.. వామపక్షాలతో మాపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget