అన్వేషించండి

Amarnath Yatra Rescue Operation: అమర్‌నాథ్‌ యాత్రలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌పై ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల- మరో 72 గంటల పాటు సహాయక చర్యలు

అమర్‌నాథ్‌ యాత్రలో తప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికుల కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా అప్‌డేట్స్‌తో బులెటిన్ విడుదల చేసింది.

మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రకృతి విపత్తు విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని... అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

జులై 8న ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారని... సంబంధిత అధికారులతో మాట్లాడారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు చిక్కుకొని ఉంటే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని కూడా చెప్పారని తెలిపింది. 

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రెండు హెల్‌లైన్లు యాక్టివేట్ చేశామని పేర్కంది ఏపీ ప్రభుత్వం. అమరావతి సచివాలయంలో 1902 నెంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. అదే టైంలో 011-23384016 నెంబర్‌తో దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొంది. 
అక్కడితో ఆగిపోకుండా.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ హిమాన్షుశుక్లను శ్రీనగర్‌ పంపినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన యాత్రికులను గుర్తించి.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు పంపేలా అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడారని తెలిపింది. 

ఇవాళ(సోమవారం) సాయంత్రం ఆరు గంటల వరకు 26 ఫోన్ కాల్స్‌ను అమర్‌నాథ్ యాత్ర హెల్ప్‌లైన్స్‌కు వచ్చాయని వివరించింది ప్రభుత్వం. దీంతోపాటు ఏపీ అధికారులు కశ్మీర్ అధికారులతో మాట్లాడి చాలా మంది ఆంధ్రప్రదేశ్‌ వాళ్లను స్వస్థలాలకు పంపించినట్టు పేర్కొంది. 

ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే మూడు పెద్ద యాత్రిక బృందాలను గుర్తించినట్టు తెలిపింది ప్రభుత్వం. అందులో ఒకటి తాడేపల్లిగూడెం వాళ్లదని. ఆ బృందంలో 20 మంది ఉన్నట్టు పేర్కొంది. మరో రెండు గ్రూప్‌లు నెల్లూరుకు చెందినవిగా తెలిపింది. వీరితోపాటు మరో 23 మంది వ్యక్తులను కూడా గుర్తించినట్టు వెల్లడించింది. 

ఈ సహాయక కార్యక్రమం మరో 72 గంటలపాటు కొనసాగిస్తామని ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే సురక్షితంగా తీసుకొస్తామంది ప్రభుత్వం. రాజమండ్రికి చెందిన కొత్త పార్వతి ఆచూకి లభ్యం కాలేదని తెలిసిందని... ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తప్పిపోయిన 37 మంది ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం సెక్రటరీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమ వారి ఆచూకి తెలియక బాధితుల కుటుంబం ఆందోళన ఉందన్నారు. వారికి నీరు, ఆహారం, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీళ్లను సురక్షితంగా స్వస్థలాలకు చేరేలే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా బాధిత ఫ్యామిలీకి చేరవేయాలని సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget