అన్వేషించండి

Amarnath Yatra Rescue Operation: అమర్‌నాథ్‌ యాత్రలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌పై ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల- మరో 72 గంటల పాటు సహాయక చర్యలు

అమర్‌నాథ్‌ యాత్రలో తప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికుల కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా అప్‌డేట్స్‌తో బులెటిన్ విడుదల చేసింది.

మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రకృతి విపత్తు విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని... అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

జులై 8న ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారని... సంబంధిత అధికారులతో మాట్లాడారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు చిక్కుకొని ఉంటే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని కూడా చెప్పారని తెలిపింది. 

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రెండు హెల్‌లైన్లు యాక్టివేట్ చేశామని పేర్కంది ఏపీ ప్రభుత్వం. అమరావతి సచివాలయంలో 1902 నెంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. అదే టైంలో 011-23384016 నెంబర్‌తో దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొంది. 
అక్కడితో ఆగిపోకుండా.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ హిమాన్షుశుక్లను శ్రీనగర్‌ పంపినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన యాత్రికులను గుర్తించి.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు పంపేలా అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడారని తెలిపింది. 

ఇవాళ(సోమవారం) సాయంత్రం ఆరు గంటల వరకు 26 ఫోన్ కాల్స్‌ను అమర్‌నాథ్ యాత్ర హెల్ప్‌లైన్స్‌కు వచ్చాయని వివరించింది ప్రభుత్వం. దీంతోపాటు ఏపీ అధికారులు కశ్మీర్ అధికారులతో మాట్లాడి చాలా మంది ఆంధ్రప్రదేశ్‌ వాళ్లను స్వస్థలాలకు పంపించినట్టు పేర్కొంది. 

ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే మూడు పెద్ద యాత్రిక బృందాలను గుర్తించినట్టు తెలిపింది ప్రభుత్వం. అందులో ఒకటి తాడేపల్లిగూడెం వాళ్లదని. ఆ బృందంలో 20 మంది ఉన్నట్టు పేర్కొంది. మరో రెండు గ్రూప్‌లు నెల్లూరుకు చెందినవిగా తెలిపింది. వీరితోపాటు మరో 23 మంది వ్యక్తులను కూడా గుర్తించినట్టు వెల్లడించింది. 

ఈ సహాయక కార్యక్రమం మరో 72 గంటలపాటు కొనసాగిస్తామని ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే సురక్షితంగా తీసుకొస్తామంది ప్రభుత్వం. రాజమండ్రికి చెందిన కొత్త పార్వతి ఆచూకి లభ్యం కాలేదని తెలిసిందని... ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తప్పిపోయిన 37 మంది ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం సెక్రటరీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమ వారి ఆచూకి తెలియక బాధితుల కుటుంబం ఆందోళన ఉందన్నారు. వారికి నీరు, ఆహారం, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీళ్లను సురక్షితంగా స్వస్థలాలకు చేరేలే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా బాధిత ఫ్యామిలీకి చేరవేయాలని సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp DesamNaveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget