By: ABP Desam | Updated at : 24 Jul 2022 02:17 PM (IST)
ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్ ఫోటో)
Prattipati Pullarao: వరద ప్రాంతాలలో పేద ప్రజలకు సాయం చేయడంలో సీఎం జగన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాటి విమర్శించారు. వరదలతో కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి చంద్రబాబు ధైర్యం చెబితే రాజకీయాలు చేస్తున్నారనటం సిగ్గుచేటని అన్నారు. సీఎం హెలికాప్టర్లో చెక్కర్లు కొట్టి వరద బాధితులను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పేదలపై కక్ష సాధిస్తున్నారని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి ఉచితంగా పేదలకు అందజేసిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆదివారం ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 1.41 కోట్ల తెల్ల కార్డు దారులకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నవశకం పేరుతో ఎస్సీ ఎస్టీలను మోసం చేసి విద్యుత్ బిల్లులతో బాధడం దుర్మార్గమని అన్నారు. నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి పథకాలలో లబ్ధిదారులు తగ్గించటం దారుణమని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందుబాటులో లేదు. డెంగీ మలేరియా వంటి విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. 1,712 మంది వైద్యులను వివిధ కారణాలతో ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రంలో వైద్యులు లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆగస్టు 15 నుంచి ఎలా అమలు చేస్తారో మంత్రి సమాధానం చెప్పాలి. పంచాయతీలలో నిధులు లేక బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదు. గ్రామాలలో పారిశుధ్యం పడకేసింది.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోలవరం పరివాహక ప్రాంతంలోని ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని కోరడం సీఎం అసమర్థతే కారణం. ఏపీ కన్నా తెలంగాణలో వరద సాయం పేదలకు ఎక్కువగా అందింది. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి వరదలతో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలి’’ అని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.
RK Resigned: వైఎస్ఆర్సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
Another Cyclone: ఆంధ్రప్రదేశ్కు మరో తుపాన్ గండం-నెలాఖరులో భారీ వర్షాలు
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
Nelson Dilipkumar: రజనీకాంత్ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
/body>