అన్వేషించండి

Pawan Kalyan: జగన్‌కు ఇంకా తెలిసిరాలేదు, ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారు - పవన్ కీలక వ్యాఖ్యలు

AP Latest News: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో జగన్ వ్యవహరించిన తీరుకూడా చర్చకు వచ్చింది.

Pawan Kalyan Comments on Jagan: ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో మాజీ సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తుండగా.. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని అన్నారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు.

‘‘అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి.. ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

చంద్రబాబు సూచనలు
ఈ ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశానికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లవద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అన్నారు. అయితే, ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలపగా.. దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

జగన్ కు అలవాటే
పైగా తప్పులు చేయడం.. చేసి వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటే అని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసును కూడా వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మొన్న వినుకొండలో హత్య కేసులోనూ ఇదే జరుగుతోందని.. దానికి రాజకీయ రంగు పులిమి.. లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనేందుకు మదనపల్లె ఘటనే నిదర్శనమని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget