అన్వేషించండి

Amaravati News: వారంలోగా ఖాళీ చేయండి- సీఎం జగన్‌ నివాసానికి సమీపంలోని ఇళ్లకు నోటీసులు

Amaravati News: సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోని అమరారెడ్డి, మదర్ థెరిసా కాలనీల్లో నివాసం ఉండే పేదలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Notice To Poor People Who Living Near CM Jagan Residence:
సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోని అమరారెడ్డి, మదర్ థెరిసా కాలనీల్లో నివాసం ఉండే పేదలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో సీఎం జగన్ ఇంటికి సమీపంలో కాలువకట్ట వెంబడి ఉన్న వెయ్యి మంది ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయాలని, లేని పక్షంలో తామే బలవంతంగా తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అమరారెడ్డి నగర్‌, మదర్‌థెరీసా కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ముఖ్యమంత్రి జగన్ భద్రత విషయంలో ఇబ్బందులొస్తాయని కారణంతో ఏడాది క్రితం ఇక్కడ ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు కాలనీ వాసులకు సూచించారు. ఆ సమయంలో తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఖాళీ చేస్తామని ఆయా కాలనీ వాసులు చెప్పారు. ఈ క్రమంలో వారందరికీ ఇటీవల అమరావతిలో సెంటు స్థలం కేటాయించారు. ప్రస్తుతం అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణ పనులు కోర్టు ఆదేశాలతో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వార్డు సచివాలయ వాలంటీర్లు కాలనీ వాసుల ఇళ్లకు నోటీసులు అందజేశారు. వారంలోగా నివాసాలను ఖాళీ చేయాలని సూచించారు.

దీంతో ఆ కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తాము 30, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని అన్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఏడు రోజుల్లో చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజశమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే ఎలా అని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ఉన్న ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పెద్దల కోసం పేదలను ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ శాతం దళిత వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరంతా రోజువారి కూలీ పనులకు వెళ్లి కడుపు నింపుకునే వారే. ఇప్పుడు సీఎం భద్రత సాకుతో ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తే తాము ఎక్కడ ఉండాలని, తమ జీవితాలు రోడ్డు మీద పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే అక్కడికి వెళ్తామని అంటున్నారు. దీనిపై సీఎం జగన్‌కు వినతి పత్రం ఇవ్వాలని భావించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చివరిగా వారికి ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నోటీసులు అందిస్తున్నట్లు సచివాలయ వలంటీర్లు చెప్పారు. నీటి పారుదల అధికారులు స్పందిస్తూ.. కాలువ కట్ట అంతా నీటి పారుదల శాఖకు చెందినదని, చట్టం ప్రకారం కాలువ కట్ట వెంబడి శాశ్వత నివాసాలు ఉండడానికి వీళ్లేదని చెబుతున్నారు. కాలువ కట్టల వెంబడి నివసించడానికి వీళ్లేదన్నారు. బాధితులకు వామపక్షాల నేతలు అండగా నిలిచారు. నిర్వాసితులకు ఎక్కడైనా ప్రత్నామ్నాయం చూపించాలని, ఆ తరువాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లోకపోతే ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget