అన్వేషించండి

Ambati Rambabu: పోలవరం ఆలస్యం చంద్రబాబు వల్లే, ప్రెజెంటేషన్ ఇచ్చిన అంబటి రాంబాబు

సోమవారం అంబటి విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తుతం భిన్న రకాలుగా చర్చ జరుగుతున్న వేళ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి, కాపర్ డ్యాం పాడైపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలేనని అన్నారు. పోలవరంపై ఎల్లో మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని అంబటి ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

చంద్రబాబు నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించామని అన్నారు. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారని నిలదీశారు? డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని, కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారని ధ్వజమెత్తారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ అనే సంస్థను తప్పించి  నవయుగ అనే సంస్థకు పనులను అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం నిధులను ఆదా చేశాం. కాఫర్ డ్యాం కట్టాక డయా ఫ్రం వాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశారు? ఆయన ముందు చూపులేని ఫలితం వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వైఎస్ఆర్ ప్రారంభించిన  పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం  చిత్తశుద్దితో తాము పనిచేస్తున్నామని అంబటి రాంబాబు  చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ. 1500 కోట్లు ఖర్చు చేసన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్రటరీలు, మంత్రులును మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget