అన్వేషించండి

KA Paul: టీడీపీకి పవన్ అమ్ముడుబోయారు, పాతిక సీట్ల కోసం పార్టీ తాకట్టు: కేఏ పాల్

KA Paul News: తెలుగుదేశం-జనసేన సీట్ల ప్రకటనపై కె.ఏ.పాల్ సంచలన ఆరోపణలు, చంద్రబాబుకు పవన్ అమ్ముడుబోయాడని ఇప్పటికైనా జనసైనికులు తెలుసుకోవాలని విమర్శలు

KA Paul: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pavan Kalyan) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.(K.A.Paul) పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. పవన్ తెలుగుశం పార్టీకి అమ్ముడుపోయాడని తాను గతంలోనే చెప్పానని...ఇప్పుడు అదే నిజమైందన్నారు. పవన్ 25 సీట్లకు అమ్ముడుపోతాడని తాను ఇప్పటికే వందసార్లు చెప్పనన్నారు. తెలుగుదేశం తాను చెప్పిన దానికన్నా ఒకటి తగ్గించే ఇచ్చిందన్నారు.

కె.ఏ.పాల్ కామెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వాలిపోయి హడావుడి చేయడం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్(K.A.Paul) కు రివాజు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడే మకాం వేసిన పాల్...కీలక నేతలపై రోజుకొక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పొత్తుపై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన పాల్....వారిది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్(Pavan Kalyan) తనతో చేతులు కలిపితే ఆయన్ను సీఎం కుర్చీపై కుర్చోపెడతానంటూ  బంపర్ ఆఫర్ ఇచ్చారు.దీనిపై పవన్ స్పందించకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలుగుదేశానికి (TDP)అమ్ముడు పోయాడని ఫ్యాకేజీ స్టార్ అంటూ  మండిపడ్డారు. పవన్ కు పాతిక సీట్లు మించి ఇవ్వరంటూ జోస్యం చెప్పారు. దీనిపై జనసైనికులు సైతం ఆయన్ను ఆడేసుకున్నారు.

చంద్రబాబు మూర్ఖుడేం కాదు
తెలుగుదేశం- జనసేన సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. జనసేన(Janasena) మొత్తం 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయనుందని శనివారం స్వయంగా  పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతే కాదు కూటమి తరపున 99మంది అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఐదుగురు జనసైనికులు సైతం ఉన్నారు. దీనిపై మరోసారి కే.ఏ. పాల్(K.A.Paul) స్పందించారు. తాను ముందు నుంచీ చెబుతున్నట్లే  జనసేకు పాతిక సీట్లు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటన చేశారన్నారు. తాను చెబుతున్నా  పవన్ సన్నిహితులు మాత్రం జనసేనకు  50 సీట్లు ఇవ్వడంతో పాటు సగం రోజులు ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రతిపాదనలు చేశారని పాల్ గుర్తుచేశాడు. జనసేనకు అన్నన్ని సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబే ఏం మూర్ఖుడు కాదని...రాజనీతజ్ఞుడని అన్నారు. ఆయనకు ఎవరిని ఎలా ఉపయోగించకోవాలో తెలుసన్నారు. అయితే తెలుగుదేశం ప్రకటించిన తొలిజాబితాలోనూ బీసీ(BC)లకు అన్యాయం జరిగిందన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం కనీసం వారికి సగం సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల్లో 57శాతం ఉన్న బీసీలు, 27శాతం ఉన్న కాపులు మేల్కోవాలన్నారు. ప్రజాశాంతిపార్టీలో బీసీలకే అవకాశం ఇస్తామన్న కె.ఏ.పాల్...పార్టీలో చేరాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ నమ్ముకుంటే జనసైనికులను ఆయన నట్టేట ముంచడం ఖాయమన్నారు. పదేళ్లకు పైగా పార్టీ జెండాను మోస్తున్న వారికి పవన్ ఏం సమాధానం చెబుతారన్నారు.కేవలం 25 సీట్లలో పోటీ చేస్తే..మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మీ వెంట నడిచిన అభిమానులు, కార్యకర్తలు ఏం కావాలన్నారు. మిమ్మల్ని నమ్ముకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్న నేతలకు ఏం సమాధానం ఇస్తారన్నారు. పవన్ కల్యాణ్ విషయంలో తాను మొదటి నుంచీ చెబుతున్నది నిజమే అవుతోందన్నారు. ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు ఆయన మాటలు నమ్మవద్దని కె.ఏ.పాల్ సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget