అన్వేషించండి

Amaravati restart Chandrababu speech: ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి - మోదీ సాయంతో అభివృద్ధి - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP CM Chandrababu: మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయికి చేరుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి రీ స్టార్ట్ సభలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

handrababu speech: :  ఆంధ్రప్రదేశ్  చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు . అమరావతి పనుల పునంప్రారంభం సభలో మాట్లాడారు.  గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం అవుతున్నాయన్నారు.     మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది. ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. 
 
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపం అని చంద్రబాబు ఉన్నారు. 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారన్నారు. అమరలింగేశ్వరస్వామి, కృష్ణానది, బౌద్ధ ఆరామాలకు నిలయం అమరావతిగా తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. అమరావతి వంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని.. అమరావతి రైతులకు నా సెల్యూట్‌ అని తెలిపారు. 2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు.  ఐదు కోట్లమంది గర్వంగా నా రాజధాని అని చెప్పుకొనేలా అమరావతి అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. 

మోదీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని.. మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ రావాలని కోరారు. ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుందని..  ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామని తెలిపారు. 5 లక్షలమంది విద్యార్థులు అమరావతిలో చదువుకుంటారన్నారు. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని గ్రీన్‌ ఎనర్జీతో కాలుష్య రహితంగా అమరావతి అభివృద్ధి ఉంటుదని తెలిపారు. 

ఇప్పటికే అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతికి వచ్చాయి. బిట్స్‌పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు రాబోతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తవుతుందన్నారు.  అమరావతినే కాదు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తిచేస్తామని..  భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాదికి పూర్తిచేస్తామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రానికి గూగుల్‌, టీసీఎస్‌ రాబోతున్నాయి.. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం.. కడపలో స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నంలో పోర్టు వస్తాయి.. ఓర్వకల్లు నోడ్‌ డ్రోన్‌ హబ్‌గా మారుతోందని తెలిపారు.

సాంకేతికతను మోదీ అర్థం చేసుకున్నట్లు మరెవరూ అర్థం చేసుకోలేరదని..  జూన్‌ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని రావాలని కోరారు. కులగణన చేయాలని మోదీ నిన్న నిర్ణయం తీసుకున్నారని అది గొప్ప నిర్ణయం అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నామని కేం ద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చంద్దరబాబు తెలిపారు. గత ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలోకి తెస్తున్నామన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget