అన్వేషించండి

AP CM వైఎస్ జగన్ ను మోసం చేసినవాళ్లు కనుమరుగు అయ్యారు: మంత్రి నాగార్జున

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అభిప్రాయపడ్డారు.

జగన్ ను మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరు
-  కనుమరుగైపోయిన నేతలే దీనికి సాక్ష్యం
-  తప్పు చేసిన శ్రీదేవి దళిత మహిళ అంటే సరిపోదు
-  ఆమె గురించి ఆలోచించే సమయం కూడా సజ్జలకు ఉండదు
-  మంత్రి మేరుగు నాగార్జున
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అభిప్రాయపడ్డారు. గతంలో జగన్ కు వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం రాజకీయాల్లో కనుమరుగైపోయిన నేతలే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మహిళల్ని వివస్త్రలుగా చేసిన అమానుషకృత్యాలు అనేకం జరిగినా కేసులు కూడా పెట్టేవారు కాదని చెప్పారు. అనేక సంఘటనల్లో దళితులు కేసులు పెట్టాలని పోలీస్టేషన్ల ఎదుట ధర్నాలు కూడా చేసిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. 

అప్పట్లో దళితులపై దాడులు జరిగితే కనీసం కేసులు కూడా పెట్టని టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వపాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడం, రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, డీబీటీ ద్వారా దళితులకు నేరుగా వేల కోట్ల రుపాయలు అందించడం మీకు అత్యాచారాలుగా కన్పిస్తున్నాయా? అని టీడీపీ నేతలను నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దళితులపై దాడులు జరిగాయో, కనీసం కేసులు కూడా పెట్టకుండా వారికి అన్యాయం ఎలా జరిగిందో, దళితులపై దాడులు జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో, ఈ విషయంలో తమ వైసీపీ ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తోందో బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తే, మూడేళ్ల తమ ప్రభుత్వ పాలనలో గత ఫిబ్రవరి మాసాంతానికే రూ.51 వేల కోట్లు ఖర్చు చేయడం దళితుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగానే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చమట చుక్కలతో గెలిచిన శ్రీదేవి ఇప్పుడు తమ పార్టీ మీద బురద చల్లడం సమంజసంకాదన్నారు. శ్రీదేవి తప్పు చేసింది కాబట్టే భయపడి హైదరాబాద్ లో దాక్కుందని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి దళిత మహిళ అని చెప్పుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఆమె గురించి ఆలోచించేంత సమయం కూడా సజ్జలకు ఉండదని చెప్పారు. శ్రీదేవి ఆస్తులు, ఆమె పార్టీ ఆఫీసు జోలికివెళ్లాల్సిన అవసరం తమకు ఏముందన్నారు. 

శ్రీదేవి తానే దాడులు చేయించుకొని ఉండవచ్చునని అన్నారు. శ్రీదేవి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియడం లేదని, ఆమె అలా మాట్లాడుతుందా, లేకపోతే ఆమెతో అలా మాట్లాడిస్తున్నారా, లేకపోతే ఆమెకు మతి భ్రమించిందా? అని నాగార్జున వ్యాఖ్యానించారు. గతంలో కూడా అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి, వెన్నుపోటు పొడిచారని గుర్తు చేసారు. అయితే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని, గతంలో ఆయనను మోసం చేసి ప్రస్తుతం రాజకీయాల్లో కనుమరుగైపోయిన నాయకులే దీనికి తార్కాణమని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget