News
News
వీడియోలు ఆటలు
X

AP High Court: అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ - రేపటికి వాయిదా

తొలుత పూర్తి నివేదికను ధర్మాసనానికి సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత వాదనలతో సిద్ధమై రావాలని రేపటికి వాయిదా వేసింది.

FOLLOW US: 
Share:

అమరావతి పరిధిలో ఆర్ - 5 అనే జోన్ ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆర్‌-5 జోన్ పేరుతో రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని హైకోర్టులో రైతులు సవాలు చేశారు. అయితే, రాజధానిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. అయితే, టిడ్కో ఇళ్ళ వ్యవహారంలో ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు అందజేయకపోవడంతో.. రాజధాని పరిధిలో నిర్మించిన 5 వేల టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల వివరాలు, ఇళ్ళ మంజూరుకు అనుసరించిన విధానాలకు సంబంధించి పూర్తి నివేదికను ధర్మాసనానికి సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఇరు వర్గాలకు హైకోర్టు సూచించింది. దీనిపై విచారణను రేపటికి (మే 2) కి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేద వారికైనా రాజధాని అమరావతిలో 1,134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు (550.65ఎకరాలు), ఎన్టీఆర్‌ (583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు కోసం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు. శివయ్య, కె.రాజేశ్‌, బెజవాడ రమేశ్‌ బాబు, ఆలూరి రాజేశ్‌, కుర్రా బ్రహ్మ, కట్టా రాజేంద్రవర ప్రసాద్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

Published at : 01 May 2023 12:25 PM (IST) Tags: Amaravati News Amaravati Farmers AP High Court High court news R5 zone

సంబంధిత కథనాలు

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam