అన్వేషించండి

AP Assembly: చంద్రబాబుకు, ఔరంగజేబుకూ తేడా లేదు - అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

బుధవారం (సెప్టెంబరు 21) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు. ఎప్పుడైనా పేదల అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశావా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం సత్య హరిశ్ఛంద్రుడిని జగన్ రూపంలో చూస్తున్నామని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో తాము 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నియోజకవర్గం నాంది పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోందని జోస్యం చెప్పారు. గతంలో కేవలం దొంగ ఓట్లతోనే చంద్రబాబు ఆరుసార్లు గెలిచారని నారాయణ స్వామి ఆరోపణలు చేశారు. బుధవారం (సెప్టెంబరు 21) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు.

ఎప్పుడైనా పేదల అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశావా అంటూ ప్రశ్నించారు. కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ రచ్చ చేస్తాడని అన్నారు. ‘‘చంద్రబాబు, ఔరంగ జేబు ఒక్కటే. ఔరంగ జేబు తండ్రిని జైలులో పెట్టించాడు. ఇప్పుడు చంద్రబాబు మామను వెన్ను పోటు పొడిచాడు. నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుల, మతాలను రెచ్చగొట్టే వ్యక్తి. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని మమ్మల్ని సవాల్ విసరడం కాదు. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు బయటికి రాగలవా? 

కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలని అడుక్కున్న వ్యక్తి నువ్వు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసిన నాయకుడు సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు గతంలో ఎందుకు చేయలేకపోయావ్? చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకో. నీలో మార్పు రావాలని ఆ దేవుడిని కోరుతున్నా. వైఎస్ జగన్ మీద బురద జల్లడం మానుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత సామాజిక వర్గాల్లో చీలికలు తెచ్చావ్. కమ్మ, రెడ్డి అంటూ విడగొట్టావ్. ఇటీవల ఓ జడ్జి తెలుగు దేశం నాయకుడిలాగా మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ఏపీకి న్యాయవ్యవస్థ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

ఏపీలో సారాను తీసుకొచ్చిందే టీడీపీ నేతలు. మద్యంపై వచ్చే ట్యాక్సులు, డబ్బులతో వాటి మీద బతికిందే టీడీపీ. నేనేమీ పారిపోను, మద్యంపై చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమే. టైమ్ ఇస్తే అన్ని విషయాలు వెల్లడిస్తా’’ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

రోజూ ఏదో ఓ గొడవ - జోగి రమేష్

టీడీపీ నేతలు ప్రతిరోజూ సభలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలకు వారు ఏం సమాధానం చెబుతారని మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్‌ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ గుర్తుకురారని, పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. వివాదం చేయడానికి టీడీపీ నేతలు రోజుకో అంశాన్ని ఎంచుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే అప్పట్లో చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టించారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రమే ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉందని అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లా పేరు పెట్టామని అన్నారు. ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైఎస్సార్‌ సీపీ అని అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్‌ గొప్ప సంస్కరణలు తెచ్చారని, ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా లభించిందని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget