అన్వేషించండి

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!

Andhra Pradesh Budget: ఏపీ ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. సూపర్ 6 హామీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు వైసీపీ గైర్హాజరు అవుతోంది.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సుమారు రూ.2.90 లక్షల కోట్లతో సిద్ధం చేసిన బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతారు. శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను చదివి వినిపిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్న ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ చదువుతారు. 

గవర్నర్ ప్రసంగం, తర్వాత బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత సభ వాయిదా వేస్తారు. అనంతరం బీఏసీ సమావేశం అవుతుంది. సభ ఎన్ని రోజులు నడపాలి ఏ ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయిస్తుంది. దాదాపు పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలకి కూడా వైసీపీ డుమ్మాకొట్టాలని నిర్ణయించింది. 

సార్వత్రిక ఎన్నికల ముందు మొదటి సారి ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అస్తవ్యస్థం చేసిందని అందుకే పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని కూటమి ప్రభుత్వం చెప్పి మరోసారి ఓటాన్ అకౌంటర్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. ఇన్నాళ్లకు ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభక ముందుకు తీసుకొస్తోంది. 

ప్రస్తుతం ప్రవేశ పెట్టే బడ్జెట్ కేవలం నాలుగు నెలలకే పరిమితం అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర ఆలోచనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో 2025-26 బడ్జెట్‌లో వివరిస్తుందని అంటున్నారు. నాలుగు నెలలకే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పటికీ ఈ కింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతోందని సమాచారం. 

ఈసారి బడ్జెట్‌లో ప్రధాన్యత ఇచ్చే అంశాలు 

  • రోడ్ల మరమ్మతులు 
  • రాజధాని పనులకు కేటాయింపులు 
  • పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు 
  • విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యం
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తగిన నిధులు 

సభకు వైసీపీ డుమ్మా 

తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన వైసీపీ అధినేత జగన్ రోజూ మీడియా సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో జరిగే చర్చలపై మీడియా సమావేశం పెట్టి వాటిని ప్రశ్నిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ్టి నుంచి రోజూో గంటపాటు మీడియాతో మాట్లాడనున్నారు. బడ్జెట్‌తోపాటు సభలో జరిగే చర్చలన్నింటిపై మాట్లాడతామన్నారు. ఈ ఉదయం పదిన్నరకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమవుతారు.  

9 గంటలకు కేబినెట్ 
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ 9 గంటలకు సమావేశం కానుంది. ఇప్పటికే అధికారుల నుంచి బడ్జెట్ ప్రతులు అందుకున్న పయ్యావుల కేశవ్ వాటిని కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌తోపాటు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ముందు ఉంచి వారి ఆమోదం తీసుకుంటారు. అనంతరం సభలో ప్రవేశ పెడతారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget