అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Chandrababu : టీడీపీ వాళ్ల తలలు పగలగొడితే శాంతిభద్రతలు బాగున్నట్లేనా?, డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నాయకులపై దౌర్జన్యాలు జరుగుతుంటే శాంతి భద్రతలు బాగున్నట్లేనా అని ప్రశ్నించారు.

Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల గురించి డీజీపీకి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని నిలదీశారు. 

వైసీపీ నాయకుల దాడులు కనిపించడం లేదా

వైసీపీతో కుమ్మక్కు అయిన పోలీసులకు.. కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు దేశం నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,  పోలీసులు దాడులు చేస్తున్నారని.. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ చెప్పడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. రాష్ట్రంలో జరిగిన విషయాలన్నీ చాలా సాధారణ ఘటనలేనని డీజీపీ ప్రకటించడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రగా ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో హింసా రాజకీయాలు జరుగుతున్నాయని, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి ఆదివారం లేఖ రాశారు. 

ఫిర్యాదు చేయలేదనడం అవాస్తవం

టీడీపీ కార్యకర్తలపై, మద్దతు దారులపై పోలీసులు అకారణంగా, అక్రమంగా కేసులు పెడితే ఇక న్యాయం ఎక్కడ ఉన్నట్లు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలీసుల మధ్య సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి.. టీడీపీ మద్దతు దారులపై లాఠీతో రక్తం కారేలా తీవ్రంగా దాడి చేసి, తల పగలు గొడితే మీకు చిన్న విషయం లాగా కనిపిస్తుందా అని లేఖలో సీబీఎన్ ప్రశ్నించారు. ఈ ఘటనలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సార్లు ఫిర్యాదులు చేసినా.. తెలుగు దేశం పార్టీ వైపు నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అని డీజీపీ చెప్పడం వాస్తవం కాదని చంద్రబాబు అన్నారు. 

జీవించే హక్కుకు భంగం కలిగించడమే

బాధితులైన టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అదే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు త్వరగా స్పందిస్తున్నారని బాబు అన్నారు. టీడీపీ నాయకులపై 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇది డీజీపీకి కనిపించడం లేదా.. ఇది మీకు తీవ్రమైన సమస్యలా కనిపించడం లేదా అని బాబు ప్రశ్నించారు. అక్రమంగా దాడులు చేయడం మీకు సమస్య కాకపోవచ్చు కానీ... గాయపడిన లోకేశ్ వైసీపీ నాయకులు, పోలీసుల దాడి వల్ల జీవించే హక్కు కోల్పోయేలా చేశారని అన్నారు. హక్కులు హరించడం తీవ్రమైన సమస్యే అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

విజయవాడలో మాజీ కార్పొరేటర్ పై జరిగిన దాడిని కూడా బాబు తీవ్రంగా ఖండించారు. చెన్ను పాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల దాడి వల్ల చెన్నుపాటి గాంధీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందనడంపై చంద్ర బాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Globetrotter Event: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
Embed widget