అన్వేషించండి

Minister Gudivada Amarnath : వచ్చే ఏడాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్

Minister Gudivada Amarnath : వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.

Minister Gudivada Amarnath : విశాఖ నుంచి పాలనపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ రాజధానిగా పాలన చేస్తామని స్పష్టంచేశారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యాసంవత్సవరంలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వికేంద్రీకరణపై త్వరలో బిల్లు పెడతామని స్పష్టం చేశారు.  మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమన్నారు. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో రాజధాని పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృధ్ధి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖలో భూఅక్రమాల ఆరోపణలపై టీడీపీ నేతలు  ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు.  విశాఖలో రాజధానికి ఒక సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఏంజరిగినా  అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.

ప్రతిపక్షం ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో నం.1 

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో చెప్పిందని గుర్తుచేశారు.  రాజధాని విశాఖ తరలించేందుకు అవసరమైన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి అమర్‌ నాథ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది  ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్‌  మీట్‌ జరగనుందని మంత్రి స్పష్టం చేశారు.  అసెంబ్లీలో పరిశ్రమలపై స్వల్ప చర్చ జరిగిందని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎం చెప్పారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందన్నారు. 301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి అసెంబ్లీకి వచ్చే చిత్తశుద్ధి, గౌరవం లేదని విమర్శించారు. చంద్రబాబు ఆలోచనలను ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నం.1 అని ఎద్దేవా చేశారు. 

ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడి 

"మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నం.1 . రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఇన్పోసిస్ లాంటి సంస్థలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయి. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమ్మిట్ ఉంటుంది. గతంలో లాగా డిప్లొమేటిక్ గా కాదు. రాష్ట్రంలో ప్రధానమైన నగరం విశాఖ. ప్రతిపక్ష నాయకుల మాటలకు రుజువులు చూపించాలి. విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదు. "- మంత్రి గుడివాడ అమర్ నాథ్ 

Also Read : CM Jagan : వృద్ధిరేటులో ఏపీ టాప్, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు - సీఎం జగన్

Also Read : AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget