By: ABP Desam | Updated at : 27 Jan 2022 05:54 PM (IST)
సజ్జల క్రమశిక్షణా చర్యల హెచ్చరికలు- తేల్చుకుంటామన్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జీతాల బిల్లులను క్లియర్ చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. మరో వైపు ప్రభుత్వం ప్రతి రోజూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఖచ్చితంగా జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయబోమని స్పష్టం చేస్తున్నారు. ఒక్క సారి పీఆర్సీ ప్రకారం జీతాలు ఉద్యోగులు అకౌంట్లలోకి జమ చేస్తే పీఆర్సీ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లవుతుంది. ఉద్యోగులు అంగీకరించినట్లవుతుందన్న అభిప్రాయం ఉంది.
అందుకే ఉద్యోగులు తమకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వవొద్దని పాత జీతాల ప్రకారమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి అదే విజ్ఞప్తి చేశారు. చివరికి చర్చల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి కూడా అదే చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయవద్దని పాత జీతాలు ఇచ్చేలా హామీ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామంటోంది. ఉద్యోగులు ఇంకా సమ్మె ప్రారంభించ లేదు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా పని చేయాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కొత్త జీతాలు వెంటనే ప్రాసెస్ చేయకపోతే ఆ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అయితే సజ్జల హెచ్చరికలను ఉద్యోగ సంఘాలు సీరియస్గా తీసుకున్నాయి. ఒక్క ఉద్యోగి పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా అప్పటికప్పుడే సమ్మెకు దిగుతామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. న్యాయ పరంగా సంప్రదించి వెంటనే సమ్మె చేస్తామని ప్రకటించారు.
జీతాల బిల్లులను ప్రతీ నెలా ఇరవై ఎనిమిదో తేదీలోలు ట్రేజరీల్లో సిద్ధం కావాలి. వాటిని ప్రభుత్వానికి పంపాలి. అయితే ఈ సారి కొత్త పీఆర్సీ కాబట్టి ఉద్యోగుల సర్వీసును చూసి.. మొత్తంగా లెక్క చూసి జీతభత్యాలు ఖరారు చేసి బిల్లులు పంపాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చేయలేదు. ప్రభుత్వం ప్రతీ రోజూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. జీతం ఒకటో తేదీన ఇవ్వాల్సిందేనని అది కూడా పాత జీతమే ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఇస్తామని.. ఉద్యోగులు ప్రాసెస్ చేయాల్సిందేనని అంటోంది. ఉద్యోగులు ప్రాసెస్ చేయకపోతే.. ఫిబ్రవరి ఒకటో తేదీన జీతాలు పడటం అనుమానంగానే ఉందని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు.
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్