అన్వేషించండి

Nayanthara Vignesh Wedding : నయనతార దంపతులపై టీటీడీ సీరియస్, ఫొటో షూట్, చెప్పులతో నడవడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు

Nayanthara Vignesh Wedding : వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే నయన్ విఘ్నేష్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో ఫొటో షూట్, మాడవీధుల్లో చెప్పులతో నడవడంపై టీటీడీ నయన్ దంపతులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది.

Nayanthara Vignesh Wedding : పెళ్లితో నూతన దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే నటి‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు భారీ షాక్ తగిలింది. గురువారం మహాబలిపురంలో పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నయన్ విఘ్నేష్ వివాహ వేడుకలు జరిగాయి.  దీంతో ఎన్నో రోజులుగా నయనతార అభిమానుల కళ నెల వేరింది అనే చెప్పుకోవాలి. వివాహ బంధంలో ఒక్కటైన నయనతార విఘ్నేష్ లు నేరుగా తిరుమల స్వామి వారి ఆశీస్సుల కోసం కొందరు బంధు మిత్రులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. అయితే కొండపై ఫొటో షూట్ కోసం నయనతార దంపతులు టీటీడీ విజిలెన్స్ అధికారిని అనుమతి‌ కోరారు. అందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సినీ నటి కావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఎటువంటి వాహన తనిఖీ చేయకుండా కొండపైకి అనుమతించడంతో ఫొటో షూట్ కి సంబంధించిన పరికరాలతో నయనతార కొండకు చేరుకున్నారు. కొండకు చేరుకోగానే ఎస్ఎంసీ కాటేజ్ ప్రాంతం నుంచి సుపధం మార్గం వద్దకు చేరుకున్న నయనతార దంపతులు దాదాపు 26 మంది బంధు, మిత్రులతో కలిసి స్వామి వారి దర్శనం కోసం ఆలయ ప్రవేశం చేశారు. 

నయనతారకు నోటీసులు 

కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న నయనతార విఘ్నేష్ లు స్వామి వారి దర్శనంతరం ఆలయ మహా ద్వారం నుంచి బయటకు వచ్చారు.‌ ఈ క్రమంలోనే ఆలయ మహా ద్వారం వద్దనే నయనతార పాదరక్షలు దరించి నడవడం, ఆలయ ముందే ఫొటో షూట్ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండడంపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దాదాపు మూడు నిమిషాల పాటు ఆలయం ముందు ఫొటో సూట్ చేయడమే కాకుండా పవిత్రంగా భావించే తిరుమాఢ వీధుల్లో నయనతార పాదరక్షలు ధరించి వెళ్లడంపై టీటీడీ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నయనతారకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేరుగా నయనతారతో మాట్లాడిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వివరణ కోరారు. తెలిసి తెలియకుండా తాను పాదరక్షలు ధరించడం జరిగిందని, తిరుమల పవిత్రత దెబ్బ తీసే ఉంటే స్వామి వారి భక్తులకు క్షమాపణ కోరుతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ కు ఓ వీడియో కూడా విడుదల చేస్తామన్నారని అధికారులు చెబుతున్నారు. 

తెలిసి తెలియక తప్పు

సినీ నటి నయనతార శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండటంతో నయనతారకు నోటీసులు జారీ చేయనున్నట్లు అంతకు ముందు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ వెల్లడించారు. మీడియా సమావేశంలో సీవీఎస్వో కిషోర్ మాట్లాడుతూ ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో నయనతార నడిచినట్లు గుర్తించామన్నారు. ఫొటో సూట్ నిర్వహించినట్లు విజువల్స్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతోందని, టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా నయనతార వ్యవహరించారని తెలిపారు. టీటీడీ రూల్స్ ప్రకారం ఆలయ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవరాదనే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. టీటీడీ విజిలెన్స్ తరపున నయనతారకు నోటీసు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు.  చెప్పులు, ఫొటో షూట్ వ్యవహారంపై ఆమెను ప్రశ్నించడం జరిగిందన్న ఆయన....భక్తుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే స్వామి వారికి, టీటీడీకి, భక్తులకు క్షమాపణ చెప్తానని నయనతార వెల్లడించారని చెప్పారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ఆమె వద్ద నుంచి వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు చేపడుతామన్నారు. తప్పు జరిగిందని మాతో నయనతార ఒప్పుకున్నారు. కావాలని చేసింది కాదు తెలియక చేశామని పేర్కొన్నారు. దీనిపై వీడియో రిలీజ్ చేస్తామని విగ్నేష్, నయనతార చెప్పారని వెల్లడించారు. 

తిరుమలలో నయనతార దంపతుల వివాహం ఎందుకు జరగలేదు? 

మొదటగా నయనతార విఘ్నేష్ లు వివాహం తిరుమలలోనే‌ నిర్వహించాలని భావించిన కొన్ని అనివార్య కారణాలతో అనుకున్నది జరుగలేదు. గత నెలలో రెండు మార్లు శ్రీవారి దర్శనానికి విచ్చేసిన నయనతార విఘ్నేష్ లు తిరుమలలో వివాహం చేసుకునేందుకు కొన్ని మఠాల్లో ఉన్న పెళ్లి మండపాలను పరిశీలించారు. ముందే అనుకున్న విధంగానే శ్రీనివాసుడు సన్నిధిలో తమ వివాహం చేసుకోవాలని అందుకు కావాల్సిన అనుమతుల కోసం  టీటీడీ ఉన్నతాధికారిని సంప్రదించారు. అయితే సినీ నటులు కావడంతో సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు అధికంగా విచ్చేసే అవకాశం ఉండడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతాయని ముందే గ్రహించిన ఆ ఉన్నతాధికారి వీరి వివాహ వేడుకలు అనుమతిని నిరాకరించారు. అధిక సంఖ్యలో భక్తుల రద్దీ నేపధ్యంలో భక్తుల ఇబ్బందులకు దృష్టిలో తీసుకుని వివాహం బయట ప్రాంతంలో చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని నయనతార విఘ్నేష్ లు సూచించినట్లు సమాచారం. ఇందు కారణంగానే మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో వివాహ వేడుకలను జరుపుకున్నారు.‌ పెళ్ళై నూతన జీవితంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే నయనతార విఘ్నేష్ లు వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Upcoming Telugu Movies: తెలుగులో బాలీవుడ్ హీరోల మూవీస్ వచ్చేస్తున్నాయ్ - ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓటీటీల్లోనూ..
తెలుగులో బాలీవుడ్ హీరోల మూవీస్ వచ్చేస్తున్నాయ్ - ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓటీటీల్లోనూ..
Stock Market Biggest Crash: గతంలోనూ స్టాక్‌ మార్కెట్‌ పునాదులు కదిలాయి - టాప్‌ 10 క్రాష్‌లు, కారణాలు ఇవే
గతంలోనూ స్టాక్‌ మార్కెట్‌ పునాదులు కదిలాయి - టాప్‌ 10 క్రాష్‌లు, కారణాలు ఇవే
Peddi Hindi Glimpse Reaction: 'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
Embed widget