అన్వేషించండి

Warangal: వరంగల్‌లో దూకుడు పెంచిన బీజేపీ.. సరికొత్త వ్యూహాలు, అధిష్ఠానం మద్దతుతో దూసుకెళ్తూ..

బండి సంజయ్ అరెస్ట్ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. టార్గెట్ 2023  అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులుకదుపుతుంది.

తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టువుగా ఉన్నా జిల్లాలను ఎంచుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా ఉన్న వరంగల్ జిల్లాలో ఆ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఆ నేతల హుడావుడి చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయం అనేలా చర్చ సాగుతుంది. ఇంతకీ ఆ పార్టీ ఏదీ? వరంగల్‌లో రాజకీయాలపై ప్రత్యేక కథనం...

ఉత్తర తెలంగాణ జిల్లాలో కాషాయం దళం కదం తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. టార్గెట్ 2023  అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులుకదుపుతుంది. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో క్యాడర్ ను బీజేపీ సన్నద్ధం చేస్తుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం ఎలా సాధించారో అదేవిధంగా రానున్న ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కనబరచేలా కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ప్రజాసమస్యలపై తెలంగాణ బీజేపీ తనదైన శైలిలో స్పందిస్తోంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ పార్టీ అధినాయకత్వం గళమెత్తుతోంది. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ దూకుడు పెంచింది. తాజాగా వరంగల్‌లో బీజేపీ ఉద్యోగుల సమస్యలపై నిరసన సభ నిర్వహించి ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు బీజేపీ బాసటగా ఉందని సంకేతాన్ని ప్రజలకు పంపారు. వరంగల్ లో నిర్వహించిన నిరసన సభలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రజస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో అణచివేస్తామని చూస్తే సరికాదని అన్నారు.

వ్యూహత్మక ఎత్తుగడలు వేయడంలో ఢిల్లీ కాషాయ నాయకత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇతర పార్టీలకు ఇస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని, గ్రామీణ స్థాయి కార్యకర్త వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు కాషాయ నేతలు. గతంలో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలపై సైతం కాషాయ దళం ఫోకస్ పెంచింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పరకాల, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట నియోజకవర్గాలలో కార్యకర్తలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గలైనా భూపాలపల్లి, జనగామ, వరంగల్ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాలలో సైతం బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలను కాషాయ దళం వైపు చూసేలా చేయడం కోసం ఆర్ఎస్ఎస్‌తో పాటు బీజేవైఎం, ఏబీవీపీ, టీజీవీపీ లాంటి అనుబంధ సంస్థలను సైతం సమాయాత్తం చేస్తున్నారు. అయితే ఎస్టీ నియోజకవర్గాలలో నెలకొన్న  పోడురైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి గిరిజన రైతులలో బీజేపీ మార్క్ చూపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

Also Read: TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ

Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..

Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget