By: ABP Desam | Updated at : 03 Mar 2023 07:58 PM (IST)
మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం - మొబైల్ పోయింది, దొరికితే తిరిగివ్వాలని ప్రకటన
Minister Errabelli Lost His Mobile: సాధారణంగా ఎక్కడికైనా జన సమూహం ఉన్న చోటకు వెళ్లినా, రద్దీ ఉన్నచోట మొబైల్ పోయింది, పర్సు పోయింది అనే మా వింటుంటాం. అయితే తాజాగా తెలంగాణ మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది.
మైక్ లో మాజీ డిప్యూటీ సీఎం అనౌన్స్ మెంట్
స్టేషన్ ఘన్ పూర్, శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తన సెల్ ఫోన్ లేదని గుర్తించారు. తన సెల్ ఫోన్ పోయిందని మంత్రి తన గన్ మెన్లకు తెలిపారు. Sri Bugulu Venkateswara Swamy Temple కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మొబైల్ పోయిందని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మైక్ లో అనౌన్స్ చేయడంతో భక్తులందరూ ఆశ్చర్యపోయారు.
రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, చాలీచాలని జీతంతో ఎంతో మంది కష్టాలు పడుతుంటారు. చిన్న అవసరమో, పెద్ద కష్టమో, పిల్లల స్కూలు ఫీజులనో ఏదో కారణంతో మనలో చాలా మంది అప్పులు చేస్తూనే ఉంటాం. అయితే చేసిన అప్పులే కాదు వాటి వడ్డీ కట్టకుండా ఉడాయించే వారు కొందరైతే.. నిజాయితీగా అప్పులను తీర్చే మార్గాన్ని వెతికే వారు కూడా ఉంటారు. అయితే ఈ అప్పులను తీర్చాలంటే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు ఉన్నాడని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అప్పుల సమస్యతో బాధపడేవారు స్టేషన్ ఘన్ పూర్ లోని శ్రీ గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు.
హైదరాబాద్ వరంగల్ రహదారిలో చిల్పూరు గుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం అని ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె వేసి భక్తితో దీపం వెలిగిస్తే అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారని, మన కష్టాలు కొన్నైనా తీరుతాయని స్వామి వారి భక్తులు భక్తులు విశ్వసిస్తారు. ఆయన వివాహానికి సైతం వెంకటేశ్వరస్వామి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారని పురాణాలలో ఉంది. తాను చేసిన అప్పులను ఎలా తీర్చాలి, అని స్వామివారు గుబులుగా ఉంటారని.. ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చిల్పూరు గుట్టకు వచ్చి తపస్సు చేశారట. అందుకే ఇక్కడ వెలసిన స్వామి వారిని శ్రీ గుబులు వేంకటేశ్వర స్వామిగా పిలుచుకుంటారు.
TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్పీఎస్సీ గుడ్బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్లైన్లోనే!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !
High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్