అన్వేషించండి

దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర- వరంగల్ సభలో మోదీ

వరంగల్‌లో పర్యటించిన పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన మోదీ... 9 ఏళ్లలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పథకాలు వివరించారు.

తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైనది అంటూ కితాబు ఇచ్చారు. హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు ప్రధానమంత్రి. ఇది దేశానికి స్వర్ణయుగమని అభివర్ణించారు. ఆరు వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రీయల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ముక్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని గుర్తు చేశారు. కరీంనగర్‌ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు.

అంతకు ముందు మాట్లాడిన నితిన్‌ గడ్కరీ.. 9 ఏళ్లలో మౌలిక సదుపాయ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతిశక్తి యోజన ద్వారా చాలా మౌలిక ప్రాజెక్టులపై భారీగా ఖర్చు పెట్టామని తెలిపారు. తెలంగాణలోనే 1.10 లక్షలకోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు. 2024 నాటికి రెండు లక్షలకోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. నాగ్‌పూర్‌ విజయవాడ రహదారికి కూడా నేడు శంకుస్థాపన చేసినట్టుపేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో 400 కిలోమీటర్లు తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు గడ్కరీ. హైవేలతో వ్యాపార అభివృద్ది జోరు పెరుగుతుందన్నారు.  ఈ హైవేలతో ఎగుమతులు, దిగుమతుల పెరగనున్నాయి అన్నారు. ఉత్తరాదిని, దక్షిణాదిని జాతీయరహదారులతో పూర్తిగా అనుసంధానం చేస్తామన్నారు. 

కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే... 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వేల అభివృద్ధి విషయంలో, మౌలిక వసుతల కల్పనలో అంకిత భావంతో పని చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడేనాటికి 2000 కిలోమీటర్లే జాతీయ రహదారులు ఉండేవని... 9 ఏళ్లలో మోదీ ప్రధాని అయ్యాక మరో 2500 కిలోమీటర్లు ఇచ్చామని తెలిపారు. 33 జిల్లాల్లో జాతీయ రహదార్లును పూర్తి చేశామన్నారు. సికీంద్రబాద్‌ రైల్వేస్టేషన్‌ 720 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎయిర్‌పోర్టు ఎలా ఉంటుందో దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీ ఎస్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్‌ వరంగల్ వరకు సిమెంట్‌ రోడ్డును 1900 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. వరంగల్ నడిబొడ్డున 150 ఎకరాల్లో రైల్వే మ్యానిఫాక్చరింగ్ యూనిట్ వస్తోందని... ఇక్కడ రోజుకు ఏడు వ్యాగన్లు చొప్పున ఏడాదికి 2400 ఉత్పత్తి చేయబోతున్నారని వివరించారు. ఫస్ట్ ఫేజ్‌లో 500 కోట్ల పెట్టుబడు పెడుతున్నారని...ఇది పూర్తి అయితే 3000 ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!

వీడియోలు

Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget