అన్వేషించండి

Singareni News: సింగరేణిలో ఎన్నికల సందడి - ఛైర్మన్‌ లేఖతో మొదలైన హడావుడి

Singareni Collieries: సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్‌ను కొనసాగించడంపై ఇటీవల జాతీయ కార్మిక సంఘాలు సెంట్రల్‌ లేబర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Singareni Collieries Company: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కాలపరిమితి 2019 అక్టోబర్‌ నెలలో ముగిసింది. అయితే కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్‌ను కొనసాగించడంపై ఇటీవల జాతీయ కార్మిక సంఘాలు సెంట్రల్‌ లేబర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే మూడేళ్లుగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఇప్పటివరకు తాత్సారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి చైర్మన్‌ శ్రీదర్‌ ఎనర్జీ సెక్రటరీకి లేఖ రాయడంతో ఎన్నికలకు సింగరేణి సిద్దమైంది.

ఆరు జిల్లాలో 50 వేల మంది కార్మికులు

సింగరేణి సంస్థ (Singareni Collieries) తెలంగాణలోని ఐదు జిల్లాలో విస్తరించి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో సింగరేణి గనులు ఉన్నాయి. వీటిలో 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో సింగరేణి కార్మికులు స్థానిక రాజకీయ పరిస్థితులకు కీలకంగా మారిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వివిద రాజకీయ పక్షాలకు కీలకంగా మారుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలకు అనుబందంగా ఉన్న కార్మిక సంఘాలను గెలిపించుకునేందుకు నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగడం గమనార్హం. 2017లో జరిగిన ఎన్నికల్లో ఒక్కొ ఏరియాలో భారీ ఎత్తున డబ్బులు, వెండి సామాగ్రి పంపిణీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార పార్టీ సుమారు రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేసిందని మిగిలిన కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.

రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు

1990 నుంచి సింగరేణిలో Singareni Collieries గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. 2003 వరకు జరిగిన ఎన్నికలు ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించారు. అయితే 2003 తర్వాత నాలుగేళ్ల కాలపరిమితి పెంచారు. 2017 ఎన్నికల అనంతరం రెండేళ్ల కాలపరిమితి విదిస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనివార్యంగా మారాయి. సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అనుబంద సంఘమైన టీబీజీకేఎస్, కాంగ్రెస్‌ అనుబంద సంఘమైన ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంద సంఘమైన ఏఐటీయూసీ, సీపీఎం అనుబంద సంఘమైన సీఐటీయూ, బీజేపీ అనుబంద సంఘమైన బీఎంఎస్‌తో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌లు పట్టు కలిగి ఉన్నాయి. తెలంగాణలో కీలకంగా ఉన్న సింగరేణి ప్రాంతంలో పట్టు సాదించేందుకు సింగరేణి ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్న రాజకీయ పార్టీలు కసరత్తులు ప్రారంబించాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget