By: ABP Desam | Updated at : 30 Dec 2022 02:42 PM (IST)
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు - అవినీతిపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయరని షర్మిల ప్రశ్న
Ys Sharmila : తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నువ్ కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు నటిస్తా అన్నట్లుగా రెండు పార్టీల నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ అవినీతి శక్తి’ అని మోదీ బహిరంగంగా విమర్శించారని..‘కేసీఆర్ అవినీతిపరుడు’ అని అమిత్ షా , ‘కేసీఆర్ కు తెలంగాణ ఏటీఎం’ అని బీఎల్ సంతోష్, ‘కేసీఆర్ అవినీతిని బయటపెడుతాం’ అని కిషన్ రెడ్డి , ‘కేసీఆర్ ను జైలుకు పంపుతం' అని బండి సంజయ్ అదే పనిగా విమర్శలు చేశారని.. కానీ ఇంత వరకూ చేసిందేమీ లేదని షర్మిల ఆరోపించారు.
‘కేసీఆర్ అవినీతి శక్తి’
- మోడీ
‘కేసీఆర్ అవినీతిపరుడు’
- అమిత్ షా
‘కేసీఆర్ కు తెలంగాణ ఏటీఎం’
- BL సంతోష్
‘కేసీఆర్ అవినీతిని బయటపెడుతాం’
- కిషన్ రెడ్డి
‘కేసీఆర్ ను జైలుకు పంపుతం’
- బండి సంజయ్
BJP లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతయ్.
కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితం.
1/2 — YS Sharmila (@realyssharmila) December 30, 2022
కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో బీజేపీ లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతాయని.. కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమవుతాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలం నేతల మాటలు...‘పాడిందే పాటరా.. పాచిపళ్ళ బీజేపీ’ అన్నట్లుందని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా....మాటలు చెప్పే బీజేపీ చర్యలు మాత్రం తీసుకోదన్నారు. నువ్వు కొట్టినట్లు చెయ్...నేను ఏడ్చినట్లు చేస్తా... అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యవ్వారం ఉందని షర్మిల విమర్శించారు.
కాళేశ్వరంలో అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్న షర్మిల
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి కనిపిస్తున్నా.. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా...కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి లేదని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐ విచారణ అడిగిన బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరదని షర్మిల ప్రశఅనించారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీ లీడర్లకు హస్తం ఉందని సీబీఐ దర్యాప్తు కోరడం లేదా అని ప్రశ్నించారు.
గతంలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసిన షర్మిల
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గతంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరక్టర్ ను కలిసి కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలు అందించామని ప్రకటించారు. తర్వాత ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలనూ కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇంకా ఎలాంటి విచారణ జరగడం లేదు. కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మైహోం సంస్థపై షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేస్తూంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సీబీఐ చేతికి వెళ్లడంతో ఇప్పుడు టీఆర్ఎస్ అవినీతిపైనా దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త
KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు - గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?
Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!