అన్వేషించండి

Telangana Elections 2023 : మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదు - బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న రేవంత్ !

Telangana Elections 2023 : ఓట్లు చీల్చి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఐటీ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పుతోందన్నారు.


Telangana Elections 2023 Revant Reddy :    మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా సీఈఓ స్పందించలేదన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదని .. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 

రైతు బంధు నిధుల జమకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ బంధం మరోసారి బయటపడిందని   రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీది ఫెవికాల్ బంధం బలపడిందని రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ కు సహకరించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చేలా బీజేపీనే చేసిందని ఆరోపించారు.  కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని పోలింగ్ కు 4 రోజుల ముందు రైతుబంధు డబ్బులు వేస్తున్నారని, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని బీఆర్ఎస్ చూస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జనవరిలో రైతుబంధు వేస్తామని ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ వేస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని విజ్ఞప్తి చేశారు.  

ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కో కేసీఆర్ భావిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పంచుకొని ఆస్తులు పంచుకున్నారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని రేవంత్ విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌కి పడే ఓట్లను చీల్చడానికి బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ పై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారని.. అయితే వారంతా బీజేపీలో ఉంటే మంచివారు లేదంటే రావణాసురులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రజాదర్బార్ పెడతాడో, జనతా బార్ పెడతాడో వాళ్ళకే తెలియాలన్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని రేవంత్ పేర్కొన్నారు.  
 
కేసీఆర్ ఓటుకు పదివేలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధుకు అనుమతి తెచ్చుకున్న వాళ్ళు దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఎన్నికల్లో మా పోటీ ఈడీ, ఐటీ తోనే ఉంది. కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు, గోయల్ ఇంటిపై దాడి, రైతుబంధు విషయంలో మోదీ, కేసీఆర్ స్నేహం స్పష్టంగా అర్థం అవుతోందని రేవంత్ విమర్శించారు.  వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు లేవు. బీజేపీలో ఉన్నప్పుడు రాముడిగా కనిపించిన వివేక్.. కాంగ్రెస్‌లోకి రాగానే రావణసూరుడిగా మారాడు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాడు కాబట్టే పొంగులేటిపై దాడులతో హింసిస్తున్నారని మండిపడ్డారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget