అన్వేషించండి

Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

Adilabad Tigers Attack:ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులల సంచారం ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటికే పశువులను హతమారుస్తున్న క్రూరమృగాలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది.

Adilabad Tigers Attack: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోనీ అటవి ప్రాంతాల్లో పెద్ద పులులు సంచరిస్తు హడలెత్తిస్తున్నాయి. ఇటీవలే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, రెబ్బేన రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నాలుగు పశువులపై దాడి చేసిన రెండు పులులు ప్రస్తుతం కాసిపేట, దేవాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బెల్లంపల్లి రేంజి పరిధిలో బుగ్గగూడెం శివారులో ఎల్లక్క అనే రైతు పత్తి చేనులో ఆవుపై పులి దాడి చేసింది. పులి దాడిలో ఆవు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

బెల్లంపల్లి రేంజ్ అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ abp దేశంతో మాట్లాడారు. సమీప ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం చేశామని, పులి దాడిలో మరణించిన ఆవు యజమాని ఎల్లక్కకు అటవి శాఖ తరఫున పరిహారం అందజేస్తామన్నారు. అయితే ఈ ఘటనకు ముందే మంచిర్యాల జిల్లా దేవాపూర్ రేంజి పరిధిలోని ఎగ్గెండి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఓ ఆవుపై పులి దాడి చేసి హతమార్చింది. ఆ తరువాత కాసిపేట మండలంలోనీ బుగ్గగూడెం శివారులో ఎల్లక్క అనే రైతు పత్తి చేనులో ఆవుపై పులి దాడి చేసి హతమార్చింది. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

దాడులు చేస్తున్నది ఒక పులేనా లేక రెండు వేరు వేరు పులుల అన్నది అటవీ శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. కానీ రెండు వేరు వేరు చోట్ల పశువులపై పులి దాడి చేయడం కొంత అనుమానాలకు తావిస్తోంది. గత వారం రోజుల క్రితం రెబ్బెన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దేవాపూర్ రేంజ్ పరిధిలోనీ ఎగ్గేండి అటవి ప్రాంతాల్లోకి వచ్చినట్లు, తిర్యాణి రేంజ్ పరిధిలో సంచరిస్తూ హడలెత్తించిన మరో పులి కాసిపేట అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆవులపై దాడి చేసి ఉండవచ్చు అనీ అంచనా వేస్తున్నారు. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

రెండు పులులు మేతకు వెళ్లిన ఆవులపై దాడులకు పాల్పడుతూ భయాందోళనను సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతానికి ఆనుకొని వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు,రైతులు ఒంటరిగా వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లో మరో పులి సంచరిస్తూ హడలెత్తిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సాత్‌మోరి గ్రామ శివారులో మెస్రం బొజ్జు అనే రైతు, పత్తి చేనులో లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. అక్కడ నుంచి నేరడిగోండ, గోధుమల్లె మీదుగా పెంబి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

శుక్రవారం సాయంత్రం వేళ పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ గ్రామాల సరిహద్దు గుండా సంచరిస్తూ తాండ్ర రేంజ్ పరిధిలోనీ లొద్ది ప్రాంతంలోకి వెళ్ళిన్నట్లు సమాచారం. అయితే ఈ పులి అక్కడ నుంచి మామడ, నేరడిగోండ, నిర్మల్ రేంజ్ అటవీ ప్రాంతం వైపు వెళ్తుందా.. లేక తిరిగి పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కడెం, ఉడుంపూర్ రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లోకి వెళ్తుందా అనేది ఎదురు చూస్తున్నారు అటవీ శాఖ అధికారులు. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

ఎప్పటికప్పుడు పులి పాదముద్రలు సేకరిస్తు పులికి ఎలాంటి అపాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఒంటరిగా ఎవరు ఉండవద్దని గుంపులుగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రివేళలో ఎవరు బయటకు రావద్దని అవగాహన కల్పించడం జరుగుతుందనీ పెంబి రేంజ్ అటవీ శాఖ అధికారి రమేష్ రావ్ abp దేశంతో తెలిపారు. 


Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన

ఏడాదిలో ఈ నాలుగు మాసాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది పులులకు మేటింగ్ సీజన్. మేటింగ్ కోసం పెద్దపులులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అనుకోని ఉన్న తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పెనుగంగా శివారులో ఓ పులి సంచరిస్తోంది. బోథ్ మండల అటవి ప్రాంతాల్లో సంచరిస్తున్న రెండు పులులలో ఒకటి ప్రస్తుతం నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది.

మరో పులి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లినట్లు అంచనా.. ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కారిడార్ పరిధిలో ఓ పులి సంచరిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట, దేవాపూర్ రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తు పశువులపై దాడి చేస్తు హడలెత్తిస్తున్నాయి. అయితే కాసిపేట, దేవాపూర్ రేంజి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో హడలెత్తిస్తున్న పులులలో ఒకటి ఆడ పులి అని, మరో పులి మగ పులి అని, నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పులి ఆడ పులి అని, ఇవి మేటింగ్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవి ప్రాంతాల్లో సంచరిస్తూ హడాలెత్తిస్తున్నాయి. 

మరికొద్ది రోజుల్లో ఇవి పరస్పరం కలుసుకోవడం వీలవుతుందా లేకా దారి తప్పి మరోచోటుకి మకాం మారుస్తాయా అన్నది సందిగ్ధంగా ఉంది. అయితే కవ్వాల్ అభయారణ్యం పరిధిలోనీ కోర్ ఏరియా పులులకు ఆవాస యోగ్యంగా ఉన్న ప్రాంతం. ఈ కోర్ ఏరియా పరిధిలోని అటవి ప్రాంతం దట్టమైన నిశ్శబ్దపు కారడవి, అయినప్పటికి పులులు ఆ ప్రాంతాలోకి వస్తు తిరిగి వెళ్లిపోతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget