అన్వేషించండి

Godavari Floods: గోదారమ్మా శాంతించు - వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ గోదావరికి హారతి, పూజలు

Puvvada Ajay Kumar Harathi At Bhadrachalam: వారం రోజులు కురిసిన వర్షాలకు గోదావరికి వరద పెరిగింది. గోదావరి నది వరద బాధితుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ సందర్శించారు.

Godavari Floods: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  భద్రాచలం గోదావరి నది వద్ద వరద ఉధృతిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఎగువ నుండి గోదావరికి భారీగా వరద నీరు రావడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుందని, రాగల 24గంటల్లో ప్రవాహం తగ్గి నిలకడగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గోదావరికి ప్రత్యేక పూజలు చేసి, నది హారతినీ ఇచ్చారు. CCLA డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సింగరేణి CMD శ్రీధర్, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి వినీత్ తదితరులు ఉన్నారు.

కొనసాగుతున్న వరద సహాయక చర్యల్లో మంత్రి పువ్వాడ..
వారం రోజులపాటు కురిసిన వర్షాలకు గోదావరికి వరద పెరిగింది. అధికారులు అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేసినా భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరిగింది తప్ప అంతగా తగ్గలేదు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడూ పరిశీలించి, లోతట్టు ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరద ముంపుకు గురి అయిన ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పర్యటించారు. కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గోని బాధితులకు ధైర్యం చెప్పి, పునరావాస కేంద్రంలోకి వెళ్ళాలని కోరారు. పునరావాస కేంద్రాల్లోఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి వివరించారు. 

భద్రాచలం - చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించిన  ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. అటుగా ఎవరి వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలని జిల్లా ఎస్పీ వినీత్ ను అదేశించారు. దీనితో పాటు ఏటపాక వద్ద రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని సైనిక అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గోదావరి నది వరద బాధితుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ సందర్శించారు. వారిని కలిసి మాట్లాడారు. అక్కడ అందుతున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాస్త తగ్గిన నీటిమట్టం..
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. శుక్రవారం నాడు దాదాపు 3 దశాబ్దాలకు గరిష్ట నీటి స్థాయికి చేరుకోవడంతో అధికారులు స్థానికులను, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సైతం నిలిపివేశారు. నిన్న రాత్రి 70.50 అడుగులకు చేరుకున్న నీటి మట్టం నేటి ఉదయం కాస్త తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70.20 అడుగులకు తగ్గింది. భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతి ఇచ్చారు. నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు మంత్రి హారతులు ఇచ్చి, ప్రవాహం తగ్గాలని శాంతించాలని గోదారమ్మను ప్రార్థించారు. 
Also Read: Godavari Floods: గోదారమ్మా శాంతించు - మంత్రి పువ్వాడ నది హారతి, పూజలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget