అన్వేషించండి

CM KCR: మేం కాంగ్రెస్ లెక్క కాదు- 5, 6 సీట్లు ఎక్కువే గెలుస్తం, పింఛన్లు పెంచుతాం: సీఎం కేసీఆర్

CM KCR:  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

CM KCR: ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు ప్రజలు నమ్మొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదన’ సభలో సీఎం మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ, తాను కాంగ్రెస్ పార్టీ లెక్క కాదని, త్వరలోనే పింఛన్లు పెంచుతామని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కేవలం రూ.200 పింఛన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచిందన్నారు.  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామన్నారు. 

ఇవాళ బరిలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఉన్నాయని.. వీళ్లేమైనా మనకు కొత్తవాళ్లా? ఒక్క అవకాశం కావాలని వాళ్లు అడుగుతున్నారని.. ఎన్ని అవకాశాలు ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు అవకాశం ఇచ్చారని, ఎన్నడైనా సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో మెడికల్‌ కాలేజీ పెట్టాలని ఆలోచించారా? అలాంటి వారికి ఎందుకు ఓటేయాలని ప్రతిపక్షాలను నిలదీశారు. గతంలో నల్గొండ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు.  

తెలంగాణ రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా అని నిలదీశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలని ఏనాడైనా ఆలోచన చేయలేదని. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు ప్రజలు రైతులు వెళ్తే కరిచినట్టు మాట్లాడేటోళ్లు కానీ నేడు పరిస్థితి మారిపోయిందన్నారు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఏ ఒక్కరిని విస్మరించకుండా.. అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామని అన్నారు. కల్యాణలక్ష్మీ ప్రారంభించినప్పుడు మొదట రూ.50 వేలే ఇచ్చామని, ఆ తర్వాత పెంచుకున్నామని, పెన్షన్‌ మొదట వెయ్యి మాత్రమే ఇచ్చేవారమని, కానీ తర్వాత రూ.2,016కు పెంచినట్లు చెప్పారు. 

కాంగ్రెస్‌ హాయంలో రూ.500 కూడా పెన్షన్‌ ఇవ్వలేదు. కేవలం 200 మొఖాన కొట్టిన కాంగ్రెస్‌, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాళ్లు పరిపాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా తప్పకుండా పెన్షన్‌ పెంచుతామని, వివరాలు త్వరలోనే. ప్రకటిస్తానని అని చెప్పుకొచ్చారు.

ఒకనాడు మోటార్‌ కాలిపోతే మనిషికి మూడు వేలు వసూలు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేవారని, ఈనాడు రాష్ట్రంలో ఎన్ని హెచ్‌పీలు పెట్టినవ్‌? ఎన్ని మోటార్లు పెట్టినవ్‌? నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుంటున్నవ్‌ అని అడిగేటోళ్లు ఉన్నరా? ప్రజలను అడిగారు. బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే, కాంగ్రెస్ నేతలు ఏమో మూడు గంటల కరెంట్‌ చాలని అంటారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించారని, గ్రామాలే కాదు, బెంగళూరు సిటీలో కూడా కరెంట్‌ కోతలు విధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ గతి వస్తుందన్నారు. 

తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ ఆపద్బంధు పథకం, బీఆర్‌ఎస్ రైతు బీమాను పోల్చి చూడాలని  ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోందన్నారు. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని, ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉన్నారా? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి తెచ్చామన్నారు.  

సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు 
సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే  4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున , సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ, స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Embed widget