అన్వేషించండి

CM KCR: మేం కాంగ్రెస్ లెక్క కాదు- 5, 6 సీట్లు ఎక్కువే గెలుస్తం, పింఛన్లు పెంచుతాం: సీఎం కేసీఆర్

CM KCR:  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

CM KCR: ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు ప్రజలు నమ్మొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదన’ సభలో సీఎం మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ, తాను కాంగ్రెస్ పార్టీ లెక్క కాదని, త్వరలోనే పింఛన్లు పెంచుతామని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కేవలం రూ.200 పింఛన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచిందన్నారు.  తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో 5 లేదా 6 సీట్లు ఎక్కువ గెలుస్తామన్నారు. 

ఇవాళ బరిలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఉన్నాయని.. వీళ్లేమైనా మనకు కొత్తవాళ్లా? ఒక్క అవకాశం కావాలని వాళ్లు అడుగుతున్నారని.. ఎన్ని అవకాశాలు ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు అవకాశం ఇచ్చారని, ఎన్నడైనా సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో మెడికల్‌ కాలేజీ పెట్టాలని ఆలోచించారా? అలాంటి వారికి ఎందుకు ఓటేయాలని ప్రతిపక్షాలను నిలదీశారు. గతంలో నల్గొండ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు.  

తెలంగాణ రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా అని నిలదీశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలని ఏనాడైనా ఆలోచన చేయలేదని. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు ప్రజలు రైతులు వెళ్తే కరిచినట్టు మాట్లాడేటోళ్లు కానీ నేడు పరిస్థితి మారిపోయిందన్నారు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఏ ఒక్కరిని విస్మరించకుండా.. అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామని అన్నారు. కల్యాణలక్ష్మీ ప్రారంభించినప్పుడు మొదట రూ.50 వేలే ఇచ్చామని, ఆ తర్వాత పెంచుకున్నామని, పెన్షన్‌ మొదట వెయ్యి మాత్రమే ఇచ్చేవారమని, కానీ తర్వాత రూ.2,016కు పెంచినట్లు చెప్పారు. 

కాంగ్రెస్‌ హాయంలో రూ.500 కూడా పెన్షన్‌ ఇవ్వలేదు. కేవలం 200 మొఖాన కొట్టిన కాంగ్రెస్‌, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాళ్లు పరిపాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా తప్పకుండా పెన్షన్‌ పెంచుతామని, వివరాలు త్వరలోనే. ప్రకటిస్తానని అని చెప్పుకొచ్చారు.

ఒకనాడు మోటార్‌ కాలిపోతే మనిషికి మూడు వేలు వసూలు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేవారని, ఈనాడు రాష్ట్రంలో ఎన్ని హెచ్‌పీలు పెట్టినవ్‌? ఎన్ని మోటార్లు పెట్టినవ్‌? నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుంటున్నవ్‌ అని అడిగేటోళ్లు ఉన్నరా? ప్రజలను అడిగారు. బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే, కాంగ్రెస్ నేతలు ఏమో మూడు గంటల కరెంట్‌ చాలని అంటారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించారని, గ్రామాలే కాదు, బెంగళూరు సిటీలో కూడా కరెంట్‌ కోతలు విధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ గతి వస్తుందన్నారు. 

తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ ఆపద్బంధు పథకం, బీఆర్‌ఎస్ రైతు బీమాను పోల్చి చూడాలని  ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోందన్నారు. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని, ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉన్నారా? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి తెచ్చామన్నారు.  

సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు 
సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే  4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున , సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ, స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget