By: ABP Desam | Updated at : 13 Jan 2023 04:08 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్
Minister KTR : మంచి ఆలోచన ఉన్న స్టార్టప్ లకు నిధులు ఇబ్బంది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్తో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్కు డల్లాస్ వెంచర్ నిధులు సమకూర్చుతుంది. హైదరాబాద్ టీ హబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... డల్లాస్ వెంచర్ కంపెనీకి అభినందనలు తెలిపారు. డల్లాస్ వెంచర్ సంస్థ భారత్లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందన్నారు. భారత్లో ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన గొప్పదని మంత్రి కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్లో సుమారు ఆరు వేల స్టార్టప్లు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, దేశంలో పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదని స్పష్టం చేశారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్లకు నిధులు కొరత లేదన్నారు. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ టీ హబ్ పనిచేస్తున్న స్టార్టప్ నుంచే వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ధ్రువ స్పేస్ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయోగంలోనే నానో రాకెట్స్ని విజయవంతంగా ప్రయోగించిందని కేటీఆర్ తెలిపారు.
The IT and Industries Minister @KTRTRS today formally announced the US and India-based cross-border Venture Capital (VC) firm @wearedallasvc’s India Fund aimed at accelerating the growth of startup community. Presided over the exchange of MoU between the VC firm and @THubHyd. pic.twitter.com/mn4BF1eTMv
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 13, 2023
టీహబ్ స్టార్టప్ లకు చిరునామా
కొత్త స్టార్టప్ లకు టీ హబ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రారంభించిన ఏడాదిలోనే అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థ భారత్లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందని కేటీఆర్. దేశంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన గొప్పదన్నారు. దేశంలో స్టార్టప్ లకు నిధుల కొరతలేదని, కానీ స్టార్టప్లను ఎలా నిర్వహిస్తారు? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారనేదే కీలకం అన్నారు. దేశంలో అనేక రంగాల్లో స్టార్టప్లు వస్తున్నాయని తెలిపారు.
పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ముంబయిలో పర్యటించారు. ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో మంత్రి కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ను కేటీఆర్ కోరారు.
వరంగల్ కు టీసీఎస్ కార్యకలాపాల విస్తరించాలని కోరిన కేటీఆర్
ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్, ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాదులో ఒక ఎమ్మార్వో Maintenance, Repair, and Overhaul (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
Eatala Rajender: టిఫిన్ చెయ్యడానికి అసెంబ్లీలో స్థలమే లేదు - ఈటల, మంత్రుల కౌంటర్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్లో మరో దారుణం!
Breaking News Live Telugu Updates: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?