IPS Transfer: తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి
Telangana IPS Transfer: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉన్నతాధికారులను 12 మందిని బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
![IPS Transfer: తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి 12 IPS officers transferred in Telangana IPS Transfer: తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/12/9a2de5a3b2455ffcb6e766f4c65d31e21707752638337233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPS Transfer in Telangana: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-2 ఐజీగా సుధీర్బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్బాబు స్థానంలో తరుణ్ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.
12 మంది ఐపీఎస్ల బదిలీ
- రాచకొండ సీపీగా తరుణ్ జోషి
- మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీగా ఉన్న సుధీర్బాబు బదిలీ
- రామగుండం కమిషనర్గా శ్రీనివాసులు
- సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్
- సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్
- హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ
- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్
- ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్
- ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు
- తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా డి. మురళీధర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)