Tokyo Olympics 2020 HighLights: చాను రజతం... స్వర్ణం కానుందా? ప్రిక్వార్టర్స్ చేరిన శరత్ కమల్
Tokyo Olympics 2020 LIVE Updates: ప్రి క్వార్టర్స్ చేరిన శరత్ కమల్... పురుషుల ఆర్చరీలో నిరాశ
Background
టోక్యో ఒలింపిక్స్లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. ఫస్ట్ అటెంప్ట్లో 110 కేజీలు, సెకండ్ అటెంప్ట్లో 115 కేజీలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ఫైనల్ అటెంప్ట్లో మాత్రం 117 కేజీలను లిప్ట్ చేయడంలో మీరాబాయి విఫలమైంది. దాంతో.. ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనాకి చెందిన హౌ జిహూయ్కి స్వర్ణం లభించింది.

భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ ఒలింపిక్స్లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ఇప్పటికే ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
టోక్యో బయల్దేరిన నీరజ్ చోప్రా
భారత స్టార్ జావలిన్ త్రోయర్ ప్లేయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ కోసం టోక్యో బయల్దేరాడు. జపాన్కి బయల్దేరేముందు అతడు ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోను పంచుకున్నాడు.
భారత్ చేరుకున్న మీరాబాయి చాను
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన మీరాబాయి చాను జపాన్ నుంచి భారత్ చేరుకున్నారు.



















