అన్వేషించండి

అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం, ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ

37th National Games: కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి.

గోవాలో 37వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. క్రీడల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా, మల్లకంబ్‌ విన్యాసాలు అబ్బురపరిచాయి. గోవా ముఖ్యమంత్రి  ప్రమోద్ సావంత్‌తో కలిసి గోల్ఫ్ జీపులో ప్రయాణిస్తూ ఫతోర్డాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోకి వచ్చిన ప్రధాని మోదీ 37వ జాతీయ క్రీడలను లాంఛనంగా ఆరంభించారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, విండ్‌సర్ఫర్‌ కాత్యా ఇడా ఈ జ్యోతిని తీసుకువెళ్లి ప్రధానికి అందించారు. అనంతరం జాతీయ క్రీడలు ఆరంభమైనట్లు ప్రధాని అధికారికంగా ప్రకటించారు. జాతీయ క్రీడల నిర్వహణకు గోవా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మోదీ కొనియాడారు. ఈ క్రీడా మౌలిక సదుపాయాలు గోవా యువతకు ఉపయోగపడతాయని అన్నారు.

అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి  భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి హామీ కూడా ఇచ్చామని ప్రధాని తెలిపారు. దేశంలో క్రీడా ప్రతిభకు లోటు లేదని ఎంతో మంది ఛాంపియన్లను భారత్  అందించిందని  మోదీ తెలిపారు. క్రీడాకారులకు ఆర్థికంగా అండగా  ఉండేందుకు  ప్రభుత్వం పథకాలు అమలు చేస్తొందన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం క్రీడలపై ఖర్చును మూడు రెట్లు పెంచిందని మోదీ గుర్తు చేశారు. దేశంలో క్రీడలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో గోవాలో ఈ క్రీడలు జరగడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, ఎంతోమంది ఛాంపియన్‌లను దేశం తయారు చేసిందని మోదీ అన్నారు. చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా పతకాలు సాధించిన క్రీడాకారులు... ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. 

ఆసియా క్రీడల్లో వందకుపైగా పతకాలతో 70 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టామని, ఆసియా పారా గేమ్స్‌లోనూ భారత ఆటగాళ్లు 70కి పైగా పతకాలు సాధించి గత రికార్డులన్నింటినీ తిరగరాశారని మోదీ అన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా ఆటగాళ్లను తయారు చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారు చేశామన్న మోదీ... దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. 

జాతీయ క్రీడలు యువ క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి వేదికన్న ప్రధాని.. అథ్లెట్లు పాత రికార్డులను బద్దలు కొట్టాలని సూచించారు. అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణను అందించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 3,000 మంది యువకులు శిక్షణ పొందుతున్నారని మోదీ వెల్లడించారు. ఖేలో ఇండియాలో ప్రతిభ సృష్టిస్తున్నామని, వీరికి ఏడాదికి రూ.6 లక్షల స్కాలర్‌షిప్‌ ఇస్తారని తెలిపారు. ఖేలో ఇండియా నుంచి 125 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువతే ప్రధానమని పేర్కొన్న మోదీ, అక్టోబర్ 31న ‘మేరా యువ భారత్’ పేరుతో కొత్త వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గోవాలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. నవంబర్ 9 వరకు ఇవి కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు జాతీయ క్రీడల్లో పాల్గొననున్నారు. జాతీయ క్రీడల్లో మొత్తం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget