News
News
X

Sania Mirza: నా రిటైర్ మెంట్ ప్రణాళికలో మార్పు ఉండొచ్చు: సానియా మీర్జా

అంతర్జాతీయ టెన్నిస్ లో 2022 తన చివరి సీజన్ అని చెప్పిన స్టార్ క్రీడాకారిణి సానియా.. ఇప్పుడు అందులో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది. గాయం కారణంగా ప్రణాళికలో మార్పు చేయవచ్చని అభిప్రాయపడింది.

FOLLOW US: 
Share:

తన రిటైర్ మెంట్ ప్రణాళికలో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ముంజేతి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు సానియా ప్రకటించింది. ఈ నెలారంభంలో కెనడియన్ ఓపెన్ లో ఆడినప్పుడు 35 ఏళ్ల సానియా గాయపడింది. ఆ తర్వాత కోలుకుని టొరంటోలో జరిగిన సిన్సినాటి ఓపెన్ లో మహిళల డబుల్స్ లో పాల్గొంది. అయితే మరలా ఇప్పుడు గాయపడిన నేపథ్యంలో తన రిటైర్ మెంట్ ప్రణాళికలపై తాజా వ్యాఖ్యలు చేసింది. 
 
అంతర్జాతీయ టెన్నిస్ లో 2022 తన చివరి సీజన్ అని.. ఈ ఏడాది ప్రారంభంలో సానియా ప్రకటించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవీ విరమణ ప్రణాళికలు మారవచ్చని.. ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన సానియా తెలిపింది.  

ప్లాన్ మారొచ్చు

ముంజేతి గాయం కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరమయ్యానని.. అందుకే యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగానని సానియా చెప్పింది. ఇలా జరిగుండాల్సింది కాదని తెలిపింది. దీనివల్ల తన రిటైర్ మెంట్ ప్రణాళికలో మార్పు ఉండొచ్చని.. ఎప్పటికప్పుడు దీని గురించి వివరాలు తెలియజేస్తానని పేర్కొంది. 

తిరిగొచ్చి టైటిల్ 


డబుల్స్ లో వరల్డ్ మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా.. 2018 జనవరి నుంచి ప్రసూతి సెలవుల్లో ఉంది. మరలా 2020 జనవరిలో తిరిగొచ్చి తన భాగస్వామి ఉక్రెయిన్ కు చెందిన నడియా కిచెనోక్ తో కలిసి హోబర్ట్ టైటిల్ గెలుచుకుంది. అయితే టోక్యో ఒలంపిక్స్ లో అంకితా రైనాతో జోడీ కట్టిన ఈ ఛాంపియన్ అంతగా రాణించలేదు.  ఉక్రెనియన్ జంట నడియా-ల్యుడ్మైలా చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 

వింబుల్డన్ కు వీడ్కోలు


ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా, ఆమె చెక్ భాగస్వామి లూసీ హ్రాడెకా మూడో రౌండ్లో నాకౌట్ అయ్యారు. క్రొయేషియాకు చెందిన భాగస్వామి మేట్ పావిక్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ సెమీఫైనల్లో నీల్ స్కుప్స్కీ -డెసిరే క్రావ్జిక్ చేతిలో ఓడిపోయిన తరువాత సానియా వింబుల్డన్ కు వీడ్కోలు పలికింది. 

మహిళల టెన్నిస్ లో భారత్ తరఫున సానియా మీర్జా విశేషంగా రాణించారు. ముఖ్యంగా డబుల్స్ లో ఎన్నో టైటిల్స్ అందుకున్నారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం ఆటకు విరామం ఇచ్చారు. తిరిగొచ్చాక ఒక్క టైటిల్ మినహా అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 35 ఏళ్ల ఈ టెన్నిస్ ప్లేయర్ రిటైర్ మెంట్ పై ఆలోచన చేశారు. 2022 చివరి సీజన్ అంటూ ప్రకటించిన సానియా గాయం కారణంగా ఇంకా ముందుగానే ఆటకు విరమణ ప్రకటించే అవకాశం ఉంది.

Published at : 24 Aug 2022 01:50 PM (IST) Tags: Sania Mirza sania mirza tennis Tennis player sania mirza sania mirza news sania news Indian Tennis news

సంబంధిత కథనాలు

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ