అన్వేషించండి

Ind vs Eng, 5th Test: యథావిధిగా 5వ టెస్టు... షమి అందుబాటులో... రోహిత్ శర్మ, పుజారా అనుమానం?

ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరగబోయే టెస్టులో ఆడేందుకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి మార్గం సుగుమమైంది.

ఇంగ్లాండ్ x భారత్ మధ్య ఐదో టెస్టుకు లైన్ క్లియర్ అయ్యింది. టీమిండియా ఫిజియోకి కరోనా పాజిటివ్ రావడంతో శుక్రవారం జరగబోయే చివరి టెస్టుపై పలు అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఆటగాళ్లకు రెండోసారి నిర్వహించిన టెస్టుల్లో అందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్ జరుగుతుందని తెలిసింది. 

ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరగబోయే టెస్టులో ఆడేందుకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి మార్గం సుగుమమైంది. గాయం కారణంగా ఇటీవల ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టుకి దూరమైన షమి... ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో హుషారుగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో.. అతడు ఐదో టెస్టులో ఆడటం లాంఛనంగా కనిపిస్తోంది. కానీ.. ఎవరి స్థానంలో షమిని ఆడిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. 

నాలుగో టెస్టులో ఉమేశ్ యాదవ్ ఆరు వికెట్లు పడగొట్టి.. టీమిండియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అలానే శార్ధూల్ ఠాకూర్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో విలువైన హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో.. ఈ ఇద్దరినీ తప్పించే సూచనలు కనిపించడం లేదు. ఇక మిగిలింది బుమ్రా, సిరాజ్.

నాలుగో టెస్టులో ఆడుతూ రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా గాయపడ్డారు. రోహిత్ మోకాలికి గాయమవ్వగా.. పరుగు తీసే సమయంలో పుజారా కాలి మడమకి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల్ని పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మెడికల్ టీమ్.. ఈరోజు రాత్రికి ఓ క్లారిటీకి రానుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఐదో టెస్టులో ఆడలేకపోతే.. పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌కి ఛాన్స్ దక్కనుంది. అలానే పుజారాకి బదులుగా సూర్యకుమార్ యాదవ్ లేదా హనుమ విహారి ఆడే అవకాశం ఉంది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకి చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఐదో టెస్టు ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ జరగనుండటంతో.. జస్‌ప్రీత్ బుమ్రాపై పని భారం తగ్గించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐదో టెస్టులో బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Srikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget