By: ABP Desam | Updated at : 06 Feb 2023 10:01 PM (IST)
నాగ్పూర్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 14 సంవత్సరాల క్రితం తలపడ్డాయి.
IND vs AUS 1st Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారతదేశం, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ప్రారంభం కానుంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆరు టెస్టు మ్యాచ్లు జరగ్గా అందులో ఒకటి భారత్, ఆస్ట్రేలియా మధ్య కూడా జరిగింది. 14 ఏళ్ల క్రితం 2008 నవంబర్లో ఈ మైదానంలో ఇరు జట్లు తలపడ్డాయి.
ఈ ఆస్ట్రేలియా పర్యటనలో, కంగారూ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ కాగా, భారత జట్టు కెప్టెన్సీ ఎంఎస్ ధోనీ చేతుల్లోకి వచ్చింది. ఈ సిరీస్లో మొత్తంగా మూడు మ్యాచ్లు ఆడగా, అప్పటికి భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది. దీంతో సిరీస్లో నాగ్పూర్ టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
సెంచరీతో రాణించిన సచిన్
మొదట బ్యాటింగ్ చేయడానికి ధోనీ తీసుకున్న నిర్ణయం సరైనదని భారత బ్యాటింగ్ లైనప్ నిరూపించింది. ఈ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 441 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ భారత్ నుంచి 109 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా సౌరవ్ గంగూలీ (85), వీరేంద్ర సెహ్వాగ్ (66), వీవీఎస్ లక్ష్మణ్ (64), మహేంద్ర సింగ్ ధోనీ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ జాసన్ క్రెజా ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
భారత్కు 86 పరుగుల ఆధిక్యం
మొదటి ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్కు ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్లో మంచి బ్యాటింగ్ను కనబరిచింది. సైమన్ కటిచ్ (102), మైక్ హస్సీ (90) ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా 355 పరుగులు చేసింది. ఇక్కడ హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా కలిసి ఐదు వికెట్లు తీయగా, భారత ఫాస్ట్ బౌలర్లు మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 86 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియాకు 382 పరుగుల లక్ష్యం
ఇక్కడ భారత జట్టు తమ రెండో ఇన్నింగ్స్నూ స్ట్రాంగ్గా ఆరంభించింది. మురళీ విజయ్ (41)తో కలిసి వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇక్కడ సెహ్వాగ్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే సెహ్వాగ్ ఔటైన తర్వాత టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు 166/6గా మారింది. ఇక్కడి నుంచి మహేంద్ర సింగ్ ధోని (55), హర్భజన్ సింగ్ (52) భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇక్కడ భారత జట్టు 295 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకు 382 పరుగుల లక్ష్యం లభించింది.
172 పరుగుల తేడాతో భారత్ విజయం
భారత్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించడం దాదాపు అసాధ్యం. ఈ మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు ఆరంభం నుంచి వికెట్లు కోల్పోతూనే ఉంది. మాథ్యూ హేడెన్ (77) మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా పిచ్పై ఎక్కువసేపు నిలువలేక పోవడంతో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 209 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ జోడీ హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా కలిసి ఏడు వికెట్లు తీశారు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తో సిరీస్ను కూడా భారత జట్టు గెలుచుకుంది.
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్కతా కెప్టెన్గా సర్ప్రైజ్ ప్లేయర్!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!