అన్వేషించండి

India Cricket Schedule: మాట నిలబెట్టుకున్న బీసీసీఐ - వచ్చే సీజన్ మొత్తం ఆ వేదికల్లోనే - తెలుగు రాష్ట్రాల్లోనూ మ్యాచ్‌లు

వన్డే వరల్డ్ కప్‌కు ముందు, తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లకు దేశంలోని ప్రముఖ స్టేడియాలు ఆతిథ్యమివ్వడం లేదు.

Team India Home Schedule for 2023-24 Season: భారత క్రికెట్ జట్టు 2023-24 సీజన్‌లో స్వదేశంలో ఆడబోయే  సిరీస్‌లకు సంబంధించి బీసీసీఐ  మంగళవారం  పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది  సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది  మార్చి వరకూ   భారత్‌లో ఆడబోయే పలు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.   ఏడాదికాలంలో  స్వదేశంలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనున్న భారత జట్టు.. ఎక్కువభాగం ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టేడియాల్లోనే ఆడనుంది.  భారత్‌లో   మ్యాచ్‌లకు విరివిగా ఆతిథ్యమిచ్చే  ప్రముఖ స్టేడియాలేవీ ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. 

అప్పుడు లొల్లి.. 

బీసీసీఐ తాజా షెడ్యూల్ ప్రకారం రాబోయే సీజన్‌లో మ్యాచ్‌లు  మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, త్రివేండ్రం, వైజాగ్, గువహతి, నాగ్‌పూర్, రాంచీ, ధర్మశాలలో జరుగనున్నాయి. వీటిలో మొహాలీ, ఇండోర్, గువహతి  స్టేడియాలు   వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్  మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం వీటికి మొండిచేయి చూపించింది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, ధర్మశాల, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకే మ్యాచ్‌లు దక్కాయి.  హైదరాబాద్‌లో పేరుకు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నా ఆడేవి మూడు మ్యాచ్‌లే. అందునా ఒక్కటంటే ఒక్కటి కూడా భారత్ మ్యాచ్ లేదు. ఇది స్థానికంగా అభిమానులతో పాటు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్‌కు కూడా కోపం తెప్పించింది.   

మొహాలీ, ఇండోర్‌లలో మ్యాచ్‌లు లేకపోవడంపై పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ ప్రతినిధులు  బహిరంగంగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అలాగే అహ్మదాబాద్‌లో కీలక  మ్యాచ్‌లను నిర్వహించడంపై కూడా  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్, పంజాబ్ క్రీడా శాఖ మంత్రి, టీఎంసీ జాతీయ ప్రతినిధి ఒకరు  బీసీసీఐ, సెక్రటరీ  జై షా ను టార్గెట్ చేస్తూ  తీవ్ర విమర్శలు చేశారు.  

హామీ ఇచ్చిన బీసీసీఐ.. 

విమర్శల నేపథ్యంలో బీసీసీఐ  సెక్రటరీ జై షా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను రాని  స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎక్కువ మ్యాచ్‌లు కేటాయిస్తామని, రొటేషన్ విధానంలో అన్ని వేదికలకు సమాన  అవకాశాలు కల్పిస్తామని   బీసీసీఐ మీటింగ్‌లో కూడా చర్చించినట్టు తెలిపాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు దక్కిన స్టేట్స్ అసోసియేషన్స్.. మళ్లీ దీనికి పోటీగా రావొద్దని కూడా వాళ్లకు ముందే చెప్పినట్టు  వివరించాడు.  

 

తాజాగా  2023-24  హోమ్ సీజన్ షెడ్యూల్‌లో మ్యాచ్ వేదికలను బట్టి బీసీసీఐ మాట నిలబెట్టుకుంది.  త్రివేండ్రం,  గువహతి,   నాగ్‌పూర్, ఇండోర్, రాజ్‌కోట్‌తో పాటు  రెండు తెలుగు రాష్ట్రాలైన  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేడియాలకు మ్యాచ్‌లు దక్కాయి.   హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో  హైదరాబాద్‌తో టీ20 మ్యాచ్‌తో పాటు ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు జరగాల్సి ఉంది. వైజాగ్ కూడా ఆస్ట్రేలియాతో టీ20, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Telangana Governor Speech: ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Jr NTR : తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Telangana Governor Speech: ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Jr NTR : తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Embed widget