అన్వేషించండి

AIFF Ban: భారత్‌పై నిషేధాన్ని ఎత్తేసిన ఫిఫా- ఇండియాలోనే అమ్మాయిల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

భారత్ లోని ఫుట్ బాల్ ప్రియులకు శుభవార్త. ఏఐఎఫ్ ఎఫ్ పై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తేసింది. దీంతో అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది.

అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్లుగా ఏఐఎఫ్ ఎఫ్ చర్యలు తీసుకోవటంతో ఈ నిషేధం తొలగిపోయింది. పాలకుల కమిటీ(సీఓఏ)ను సుప్రీంకోర్టు రద్దు చేయడం, సమాఖ్యపై నియంత్రణ ఏఐఎఫ్ ఎఫ్ చేతికి రావటంతో ఫిపా బ్యూరో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది. 

ఏఐఎఫ్ ఎఫ్ కు కొత్త నియమావళి ఏర్పాటుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సుప్రీంకోర్టు గతంలో సీఓఏను నియమించింది. అది సమర్పించిన నియమావళి ముసాయిదాలో, ఎన్నికల నిర్వహణలో ఫిఫా కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అయితే సీఓఏ పట్టించుకోకపోవటంతో.. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఈనెల 16న ఏఐఎఫ్ ఎఫ్ పై ఫిఫా నిషేధం విధించింది. అండర్-17 ప్రపంచకప్ ను భారత్ లో నిర్వహించబోమని తెలిపింది. దీంతో ఈ నిషేధాన్ని తొలగించేలా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టుల సీఓఏను రద్దు చేసింది. దీంతో ఫిఫా నిషేధాన్ని ఎత్తివేసింది. 

ప్రణాళిక ప్రకారం అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్ లోనే జరుగుతుందని ఫిఫా తెలిపింది. బ్యూరో మండలి ఏఐఎఫ్ ఎఫ్ పై నిషేధాన్ని వెంటనే తొలగించాలని నిర్ణయించిందని చెప్పింది. ఏఐఎఫ్ ఎఫ్ కు ఎన్నికల నిర్వహణపై తదుపరి చర్యల గురించి త్వరలోనే చర్చిస్తామని ఫిఫా వెల్లడించింది. 

"ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను చేపట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ను రద్దు చేసినట్టు ఫిఫా ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ పరిపాలన, రోజువారీ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది." అని అధికారిక ప్రకటనలో తెలిపింది.

"ఏఐఎఫ్‌ఎఫ్‌, ఏఎఫ్‌సీ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాయి." అని పేర్కొంది.

ఈ మధ్య కాలంలో ఇతరుల ప్రభావంతో నడుస్తున్న ఏఐఎఫ్‌ఎఫ్‌ అధికారాలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఫిపా ప్రకటించింది. U-17 మహిళల ప్రపంచ కప్ ప్రణాళిక ప్రకారం భారత్‌ నిర్వహించడం లేదని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫిఫా 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌ని మొదటిసారి నిషేధించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget