అన్వేషించండి

Janmashtami 2025: అల్లరి కృష్ణయ్య 5 అద్భుత ఆలయాలు! ఈ క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు చూసి తీరాల్సిందే

Top 5 Krishna Temples In India: మహారాష్ట్రలో విఠోబా అంటారు, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా కొలుస్తారు, ఉడిపిలో కృష్ణుడు, గురువాయూరులో గురువాయురప్ప ప్రతి క్షేత్రం ప్రత్యేకమే..

Janmashtami 2025: శ్రావణమాసం బహుళపక్షం అష్టమి తిథి అర్థరాత్రి సమయంలో రోహణి నక్షత్రంలో జన్మించాడు శ్రీ కృష్ణుడు. ఈ రోజు జరుపుకునే కృష్ణాష్టమి వేడుకలు మధుర,బృందావనంలో అంబరాన్నంటుతాయి. ఈ రెండు ప్రదేశాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కన్నయ్యకు అద్భుతమైన ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికీ చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వీటిలో ఎన్ని దేవాలయాలు మీరు దర్శించుకున్నారు?
 
ఉడిపి -  కర్ణాటక

ఉడిపి శ్రీకృష్ణుడి అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి.  13వ శతాబ్దంలో మధ్వాచార్యులు ఇక్కడ కృష్ణుడిని ప్రతిష్టించారు. ఇక్కడున్న స్వామివారి మూర్తి అత్యంత విశిష్టమైనది. దీనివెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. ఓసారి సముద్రం ఒడ్డుకి వెళ్లారు మధ్వాచార్యులవారు. ఆ సమయంలో సముద్రం మధ్యలో నీట మునుగుతున్న ఓ పడవను ఒడ్డుకి చేర్చారు. అందుకు ప్రతిగా ఏం కావాలని అడిగారు పడవలో ఉన్నవారు. అందులో ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని అడిగి తీసుకున్నారు మధ్వాచార్యులు. పడవలో ఉండే సంపదను కాకుండా ఓ విగ్రహాన్ని అడిగి తీసుకున్నారేంటని ఆశ్చర్యపోయారు అక్కడున్నవారంతా. అయితే ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే.. నీ చిన్నతనాన్ని నేను ఆస్వాదించలేదన్న దేవకి కోరిక మేరకు మళ్లీ కృష్ణుడు చిన్న పిల్లాడిలా మారి అల్లరి చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రుక్మిణీదేవి దేవశిల్పి విశ్వకర్మను పిలిచి కృష్ణుడి రూపాన్ని చెక్కించింది. ఆ విగ్రహమే ప్రస్తుతం మీరు ఉడిపిలో దర్శించుకుంటున్న కృష్ణుడి రూపం. ద్వారక నీట మునిగిన తర్వాత సముద్రం ద్వారా అలా ఉడిపికి చేరుకుంది. ఓ భక్తుడిని దర్శనానికి అనుమతించకపోవడంతో కిటికీలోంచి స్వామిని దర్శించుకున్నాడు. అప్పటి నుంచి భక్తులంతా కనకదాసుడు అనే భక్తుడిలా కిటికీ నుంచే దర్శించుకోవడం ప్రారంభమైంది. ఏటా కృష్ణాష్టమి రోజు   ‘విట్టల్ పిండి’ పేరుతో  మట్టివిగ్రహాన్ని రూపొందించి ఊరేగించిన తర్వాత ఆలయంలో ఉన్న సరోవరంలో నిమజ్జనం చేస్తారు.

​గురువాయూర్  - కేరళ
 
సౌత్ లో శ్రీ కృష్ణుడి ఆలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.  అన్నిటికన్నా ప్రసిద్ధమైన ఆలయం గురువాయూర్...ఈక్షేత్రాన్ని దక్షిణ ద్వారక అంటారు.  దేవగురు బృహస్పతి, వాయుదేవుడి సహాయంతో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. అందుకే దీనిని  భూలోక వైకుంఠంగా అభివర్ణిస్తారు.ఇక్కడ కన్నయ్య 4 చేతులతో దర్శనమిస్తాడు. జన్మాష్టమి, కుచేల,డోలాపూర్ణిమ, విషు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులు ఇక్కడ అన్నప్రాసన చేస్తే  అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల నమ్మకం.
 
పార్థసారథి - తమిళనాడు

చెన్నైలో ఉన్న పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన 4 అవతారాలు  రాముడు, కృష్ణుడు, నారసింహుడు, వరాహాస్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి పార్థసారథి ఆలయం

బృందావనం - ఉత్తర ప్రదేశ్
 
శ్రీ కృష్ణ జన్మభూమి అయిన మధురలో కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి.  50 అడుగుల ఎత్తైన ద్వాదశాదిత్య శిల‌పై  కొలువైన శ్రీ రాధా మదన్ మోహన్ మందిరాన్ని బృందావనంలో నిర్మించిన మొదటి ఆలయం అంటారు. ఆలయ గర్భగుడిలో రాథాకృష్ణులు, బలరాములతో పాటూ పాలరాతి కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడు జన్మించింది ఈ జైల్లోనే అని చెబుతారు. బృందావనం సమీపంలో  గోవర్ధన పర్వతం ఉంటుంది. ఇంకా రాధా కుండ్/ శ్యామ్ కుండ్ ఇవన్నీ గోపికలు కృష్ణుడికోసం ఎదురుచూసిన ప్రదేశాలివి.  

ద్వారక -గుజరాత్
 
కృష్ణుడు పరిపాలించిన ద్వారక అత్యంత మహిమాన్విత ప్రదేశం. వేల ఏళ్ల క్రితం నిర్మించిన ద్వారకాధీశుడి ఆలయం ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కి ఉంటుంది. శ్రీ మహాలక్షి బహుమతిగా ఇచ్చిన దండతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. చాళుక్య శైలిలో నిర్మించిన ఈ ఆళయంలో   జన్మాష్టమి వేడుకలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ సమీపంలో దర్శించుకునేందుకు చాలా ప్రదేశాలున్నాయి.

పూరీ- ఒడిశా

బలరాముడు, సుభద్రతో కలసి జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరీ. ఈ క్షేత్రంలో అడుగడుగునా మిస్టరీలే.  ఏటా ఆషాఢ మాసం ప్రారంభంలో జరిగే రథయాత్ర అత్యంత ప్రత్యేకం.  

ఇవిమాత్రమే కాదు..ఇంకా జైపూర్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా కృష్ణ భగవానుడికి ఎన్నో ఆలయాలున్నాయి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget