అన్వేషించండి

Dhanurmasam : తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం

Tiruppavai In Tirumala and Yadagiri Gutta: ధనుర్మాసం ప్రారంభమైంది. ఉదయాన్నే లేచిన భక్తులు గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుప్పావై ప్రవచనాలు చేశారు.

Dhanurmasam Starts: తెలుగు పల్లెలకు సంక్రాంతి కళ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సంక్రాంతి సందడిని తీసుకొచ్చింది. వణికిస్తున్న చలిలో ప్రజలంతా ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి ధనుర్మాస పూజలు ప్రారంభించారు. వైష్ణవాలయాల్లో పాశులా మంత్రాలు జపించి గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. 

ధనుర్మాసం ఇవాళ్టి నుంచి భోగి పండగ వరకు ఉంటుంది. రోజూ గోదాదేవికి భక్తులు పూజలు చేస్తారు. ఆఖరి రోజున అంటే భోగి పండగ నాడు గోదాశ్రీరంగనాథుల కల్యాణం నిర్వహించి పూజను ముగిస్తారు. మధ్యలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్షలు చేస్తారు భక్తులు. అది ఈసారి డిసెంబల్‌ 26న వచ్చింది.

సంక్రాంతి వేడుకలు ప్రారంభానికి సూచికగా ధనుర్మాసనం ప్రారంభం రోజునే నెల గంట మోగుతుంది. ఇవాళ్టి నుంచే గ్రామాల్లో హరిదాసుల కీర్తనలు వినిపిస్తాయి. డూడూ బసవన్న విన్యాసాలు కనిపిస్తాయి. ఇంటి ముంగిట రంగవల్లులు దర్శనమిస్తాయి. 

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వరకు కాలాన్ని ధనుర్మాసంగా చెబుతారు. ఈ టైంలో సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు దాన్ని సూచించేలా ఆలయాల్లో గంటను మోగిస్తారు. దీన్నే నెల గంట అంటారు. అప్పటి నుంచి ప్రతి రోజూ వైష్ణవ ఆలయాల్లో వేకువ జామున 4గంటల నుంచి పూజలు చేస్తారు. 

తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో కూడా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట ఆలయంలో ఉదయం నుంచి 30 రోజుల పాటు ఉదయం 5 గంటలకు తిరుప్పావై నిర్వహిస్తారు. జనవరి 13న గోదా కళ్యాణం, 14 న ఒడిబియ్యం కార్యక్రమంతో జరగుతుంది. 

తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏడాది పొడవునా సుప్రభాత సేవను తెల్లవారుజామున సమర్పించినప్పటికీ ఈ నెల రోజుల పాటు మాత్రం సుప్రభాతం కాకుండా తిరుప్పావై పారాయణం చేస్తారు. తనను తాను ద్వాపర యుగానికి చెందిన శ్రీదేవి చిన్న విగ్రహం పక్కనే ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి వక్షస్థలంపై ధనుర్మాసం చివరి వరకు బంగారు చిలుకను అలంకరిస్తారు. తిరుప్పావై పూర్తిగా ఏకాంతంగా పఠిస్తారు. ధనుర్మాస సమయంలో భగవంతుడికి సహస్ర నామార్చన కోసం పవిత్రమైన తులసికి బదులుగా బిల్వ ఆకులను ఉపయోగిస్తారు.

పవిత్ర ధనుర్మాసాన్ని జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేశారు. 

భాగవతం దశమ స్కందంలో చెప్పినట్టు 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని చెబుతారు. 

ఈ వ్రతం ఎలా చేయాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. భగవంతునికి సేవ చేయడమే ఈ తిరుప్పావై సారాంశం. ఈ వ్రతం ఒకరు చేయడం కంటే అందరినీ కలుపుకుని చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై శాత్తు మొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget