అన్వేషించండి

త్వరలో విశాఖలో కేసీఆర్ - జగన్ భేటీ ! రాజకీయం మారబోతోందా ?

విశాఖలో కేసీఆర్ - జగన్ భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పరిణామాల వేగంగా మారిపోతున్న సమయంలో వీరి భేటీ కలకలం రేపే అవవకాశం ఉంది.

ఏపీ సిఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ సిఎం కెసిఆర్‌ కనిపించడమే కాదు దగ్గరుండి మరీ అన్నీ తానై చూసుకున్నారు.  ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వీరిద్దరూ కలిశారు. కానీ కృష్ణా జలాలు, పోతిరెడ్డిపాడు వివాదాలతో ఈ సిఎంలు దూరమయ్యారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహారించారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరు మళ్లీ కలిసి కనిపించే ఛాన్స్‌ ఉందా ?  అంటే అవునన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు విశాఖకి రాబోతున్నారట. విశాఖ శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు  జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సిఎం జగన్‌ కి ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఈ నెల 28న శారదాపీఠంకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అంతే కాదు రాజశ్యామల యాగంలో కూడా పాల్గొనబోతున్నారట. 

ఎన్నికల తరవాత వరుసగా భేటీ - తర్వాత కలవని సీఎంలు

2019 ఎన్నికలకు ముందు జగన్‌ ఈ యాగం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం పలుసార్లు శారదాపీఠంకి వెళ్లడం స్వామి ఆశీస్సులు తీసుకోవడం తెలిసిందే. జగన్‌ కి ఈ యాగం చేయమని కెసిఆరే సలహా ఇచ్చారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. శారదా పీఠం ఆహ్వానం తెలంగాణ సిఎం కెసిఆర్‌ కి కూడా అందిందని బీఆర్‌ ఎస్‌ ఏపీ నేతలు చెబుతున్నారు. ఏ రోజు వస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా తప్పకుండా మాత్రం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. అయితే ఒకే రోజు ఇద్దరు సిఎంలు విశాఖకి వస్తే భద్రత కల్పించడం కష్టం కాబట్టి నెలాఖరున వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

విశాఖలో కేసీఆర్, జగన్ చర్చలు జరిపే అవకాశం 

ఇప్పటికే పలుమార్లు కెసిఆర్‌ రాజశ్యామల యాగం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు ఢిల్లీలో బీఆర్‌ ఎస్‌ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం రోజున కూడా ఈ యాగం చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఏపీ బీఆర్‌ ఎస్‌ నేతలు. త్వరలో విశాఖలో బీఆర్‌ ఎస్‌ సభ ఉంటుందన్న ఆపార్టీ నేతలు ఎప్పుడన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు విశాఖకి రానున్న తెలంగాణ సిఎంకి జగన్‌ స్వాగతం పలుకుతారా లేదంటే వ్యక్తిగత పర్యటనగా భావిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఉంటే ఉగాది తర్వాత నుంచి పాలనను విశాఖ నుంచే జగన్‌ ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే మార్చిలో రెండు అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. వీటన్నింటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్‌ తనకు కలిసొచ్చిన శారదాపీఠంకి వెళ్లి వస్తే అంతా శుభం జరుగుతుందన్న భావనలో ఉన్నారట. అందుకే 28 వతేదీన వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మార్పులు 

కేసీఆర్ , జగన్ భేటీ అయితే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరువురి మధ్య రాజకీయంగా పరస్పర అవగాహన ఉందని ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో  ఏపీలోనూ విస్తరించాలనుకుంటున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓట్లను చీల్చి.. వైసీపీకి మేలు చేయాలని అనుకుంటున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. వీటన్నింటికీ..  ఇద్దరి భేటీ మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget