అన్వేషించండి

NTR centenary celebrations : తెలుగు రాజకీయాల్లో తొలి సంక్షేమ సంతకం ఎన్టీఆర్ - ఇప్పటికీ ఆ పథకాలు ఎవర్ గ్రీన్ !

సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

 

NTR centenary celebrations : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ . అసలు ఇలాంటి పథకాలను ప్రవేశ పెట్టిందే ఎన్టీఆర్ రామారావు.   సంక్షేమం పథకాలకు కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాదు.. వాటి అమలులో కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుల్నే ఆశ్చర్యపరిచారు. ఆయన పథకాల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రజా క్షేమం…  ఎన్నికోట్ల రూపాయల పథకమైనా సరే.. పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేవారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థానిచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలను రూపకల్పన చేశారు.  సమాజంలో ఉన్న అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. స్పష్టంగా చెప్పాలంటే… తెలుగు ప్రజలకు అప్పటి వరకూ తెలియని సుపరిపాలనను కొత్తగా రుచి చూపించారు ఎన్టీఆర్.

కిలో రూ.2 పథకం ఇప్పుడు రూ.1 స్కీమ్ అయింది. ..!

ఎన్టీఆర్  ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనది… మొదటిది… ఇప్పటికీ నేతలకు ఆదర్శంగా ఉన్నది రెండ్రూపాయల కిలో బియ్యం పథకం… ప్రతి పేదోడి కడుపూ నింపాలన్న సదాశయంతో రెండ్రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సృష్టించారు. సీఎం అయిన మొదటిసారే కాదు… అధికారంలోకి వచ్చిన మూడు సార్లూ… ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ పథకం అమల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా… వెరవకుండా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.1983 లో త‌ను అధికారంలోకి రాగానే …పేద‌వాడి క‌డుపునింపాల‌నే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. అప్ప‌ట్లో ఇదో సంచ‌ల‌నం. కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఈ స్కీమ్ ను కొనియాడింది.

జనతా వస్త్రాల పంపిణీ 

ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికీ కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి కొత్త సంచలనానికి తెర తీశారు. పేదల కనీస అవసరాలైన… రోటీ కపడా ఔర్ మకాన్ లకు ఎక్కడా లోటు లేకుండా చూశారు. 

చాలా రాష్ట్రాల్లో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పెట్టిన అన్నం, సాంబార్ పథకమే మూలం

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… హైదరాబాద్‌లో గంజి కేంద్రాలు పెట్టాలంటూ వామపక్ష నేతలు యాత్ర చేపట్టారు. వారి యాత్ర అబిడ్స్ చేరుకున్నప్పుడు… అన్నగారు ఎదురై, విషయం తెలుసుకుని, గంజి కేంద్రాలేంటి బ్రదర్… ఏకంగా అన్నమే పెడదాం అంటూ అన్నం, సాంబార్ పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రజా క్యాంటిన్లకు మూలం.. అన్నగారి అన్నం, సాంబారే.

5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం

పేద‌ల కోసం త‌న ఐదేండ్ల ప‌రిపాల‌న కాలంలో 5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాడు. ఎంతో మంది పేద‌ల‌కు గూడును క‌ల్పించారు ఎన్టీఆర్‌. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించి ఒక గూడు కల్పించాడు. అగ్రకుల పెత్తందార్లకు కొమ్ముకాసే పటేల్‌ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి సంచలనం రేపారు. తాలూకా, సమితి వంటి కాలం చెల్లిన వ్యవస్థలకు చరమగీతం పాడి మండల వ్యవస్థను ముందుకు తెచ్చారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దాంతో పాటే అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రభావవంతమైన అమలుకు నోచుకున్నాయి.యువత, బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్ద పీట వేశారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు అప్పటికి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఎన్టీ రామారావు రాకతో మొత్తం సీన్‌ మారింది. బీసీల రాజకీయ ఎదుగుదల ప్రారంభమైంది. అంతే కాదు ..అప్పటి వరకు స్తబ్దుగా ..అలసత్వానికి మారుపేరుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పట్టారాయన. ఆకస్మాక తనిఖీలతో ప్రభుత్వ సిబ్బందిని పరుగులు పెట్టించారు.మండల వ్యవస్థ రద్దుతో పాటు మద్యపాన నిషేదం వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 

ప‌టేల్ ప‌ట్వారీ విధానం ర‌ద్దు

గ్రామ భూముల రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను త‌మ చేతుల్లో పెట్టుకుని పేద రైతుల‌ను అనేక క‌ష్టాల‌కు గురి చేస్తున్న ప‌టేల్‌, ప‌ట్వారీల అధికారాల‌ను తొల‌గిస్తూ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకొని పేద రైతుల‌కు ఆనందాన్ని పంచాడు. బీసీలకు రిజర్వేషన్లు, కార్మికులకు సౌకర్యాలు, పేదలకు పక్కా గృహాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో… తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్ స్టాండ్లు అన్నగారి హయాంలో నిర్మించినవే. ప్రజల వద్దకే పాలన అన్నది ఆ దిగ్గజం అన్నగారి హయాంలోనే మొదలైంది. ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంతటి క్లిష్టమైన నిర్ణయాన్నైనా క్షణాల్లో తీసుకునేవారు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆరు నూరైనా అది అమలవ్వాల్సింద

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం

విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డానికి పేద విద్యార్థుల‌ను చ‌దువు వైపు ప్రోత్స‌హించే విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతోంది. 
 
నీటి పారుదల రంగానికి ప్రాధాన్యం 

నీటిపారుదల రంగాన్నికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగానే.. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తై… చెన్నైతో పాటు రాయలసీమ ప్రజల దాహం తీరింది. రైతులకు మేలు జరుగుతుందంటే ఎంత పెద్ద నిర్ణయమైనా క్షణాల్లో తీసుకునేవారు. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. ఓ సారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరాం సాగర్ ప్రాజక్టు గురించిన ఫైల్‌ను ఇంజినీర్లు ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఫైల్ చూడగానే… ఈ ప్రాజెక్టుతో ఎంత మంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారుల్ని అడిగారు.వాళ్లు ఇన్ని వేల ఎకరాలకు నీరంది… లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చెంత అవుతుందన్నది కూడా చూడకుండానే… వెంటనే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారు. అధికారులు ఫైల్ తెచ్చిన దగ్గర్నుంచి,  నిర్ణయం తీసుకోడానికి మధ్య సమయం… కేవలం మూడు నిముషాలే. ఆ ప్రాజెక్టుతో అప్పట్లోనే రూ.780 కోట్ల భారం పడుతుందని అధికారులు చెప్పినా.. ప్రాజెక్టు కట్టాల్సిందే అని నిక్కచ్చిగా తేల్చిప్పారు. ఏ తరం నాయకుడైనా ఒక ప్రాజెక్టు గురించి.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మున్మందు కూడా చూడలేమేమో.

తెలుగు భాష అమలులో ఎన్టీఆర్‌ది ప్రత్యేక శైలి 

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులోనే అన్నీ పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా… అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే. ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం, దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండేలా చేయడం, హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం వంటి నిర్ణయాలతో తెలుగు జాతికి, సంస్కృతికి పునరుజ్జీవనమిచ్చారు. అన్నగారు ఎక్కడికెళ్లినా అచ్చతెనుగు పంచె కట్టుతో.. భుజానా కండువా వేసుకుని తెలుగువాడికి నిలువెత్తు చిరునామాలా కనిపించేవారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. రేపు సాయంత్రం సీఎల్పీ మీటింగ్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. రేపు సాయంత్రం సీఎల్పీ మీటింగ్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget